Hyderabad : పాతబస్తీలో టెన్షన్ వాతావరణం.. హైదరాబాద్ లో 200 కు పైగా పాకిస్తానీయులు ఉన్నారట.. వామ్మో !
ప్రధానాంశాలు:
Hyderabad : పాతబస్తీలో టెన్షన్ వాతావరణం.. 200 మంది పాకిస్తానీయులు తలదాచుకున్నారు..!
Hyderabad : జమ్ము కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు కఠినతరం అయ్యాయి. 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన ఈ దారుణ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులకు సార్క్ వీసాలను రద్దు చేసినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అంతేకాకుండా, తాత్కాలిక వీసాలపై భారత్లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లోగా దేశాన్ని విడిచి వెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad : పాతబస్తీలో టెన్షన్ వాతావరణం.. హైదరాబాద్ లో 200 కు పైగా పాకిస్తానీయులు ఉన్నారట.. వామ్మో !
Hyderabad హైదరాబాద్ లో 200 కు పైగా పాకిస్తానీయులు ఉన్నారట.. వామ్మో !
రాష్ట్రాలకు పంపిన పత్రికా ప్రకటనలో పాక్ పౌరుల వివరాలను పంపించామని, వీరిని వెంటనే గుర్తించి వెనక్కి పంపించాల్సిందిగా సూచించారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి వచ్చిన 208 మంది పాక్ పౌరుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా తాత్కాలిక వీసాలతో భారత్లోకి ప్రవేశించగా, ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ అధికారులు వారి పాస్పోర్టు, బస వివరాలను పరిశీలిస్తున్నారు.
వీలైనంత త్వరగా వారిని గుర్తించి, పాక్కు తిరిగి పంపేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జవాన్లు తక్షణమే తమ విభాగాలకు హాజరుకావాలని ఆదేశించారు. జమ్ముకాశ్మీర్ పరిస్థితులపై అన్ని భద్రతా విభాగాలు అత్యవసర సమావేశాలు నిర్వహించాయి.