Mynampally : తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇంకో రెండు మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. రాత్రికి రాత్రే రాజకీయాలు మారుతున్నాయి. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో అర్థం కావడం లేదు. అందుకే.. పార్టీలన్నీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందనే ఆశలో ఉన్న చాలామంది నేతలు నిరుత్సాహపడ్డారు. తమకు సీటు దక్కకపోవడంతో వేరే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే బీఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి టికెట్ పొందిన మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మైనంపల్లి, మంత్రి హరీశ్ రావు మధ్య పొలిటికల్ వార్ సాగుతున్న విషయం తెలిసిందే. హరీశ్ రావుపై మైనంపల్లి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినా మైనంపల్లికి టికెట్ మాత్రం ఇచ్చింది బీఆర్ఎస్ హైకమాండ్. కానీ.. తన కొడుకుకి మెదక్ సీటు కావాలని కూడా కోరారు. కానీ.. తన కొడుక్కి మాత్రం టికెట్ దక్కలేదు. అందుకే బీఆర్ఎస్ హైకమాండ్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మైనంపల్లి కాంగ్రెస్ లో పార్టీలో చేరబోతున్నారనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి.
ఈనేపథ్యంలోనే మైనంపల్లి ఇటీవలే కర్ణాటకలోని బెంగళూరు వెళ్లి అక్కడి సీనియర్ నేత డీకే శివకుమార్ ను కలిసి వచ్చినట్టు తెలుస్తోంది. శివకుమార్ కూడా మైనంపల్లి పార్టీ చేరికపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ మైనంపల్లి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే మైనంపల్లికి మల్కాజిగిరి నుంచి కాకుండా మేడ్చల్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపిస్తోందట. దానికి కారణం.. బీఆర్ఎస్ నుంచి మేడ్చల్ లో పోటీ చేస్తున్న మల్లారెడ్డిని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా అది మైనంపల్లి వల్లనే అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట. అలాగే.. మైనంపల్లి కొడుక్కి మెదక్ టికెట్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పడంతో ఇక కాంగ్రెస్ లో చేరేందుకు మంచి ముహూర్తం చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.