
Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లకి ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!
Revanth Reddy : తెలంగాణలో Telangana ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో indiramma housing scheme లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ప్రకటించడం మనం చూశాం. అయితే మొదటి దశలో స్థలం ఉన్నవారికే ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిచనున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పుడు ఇసుక సరఫరాపై అధ్యయనం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా గనుల శాఖపై రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అధ్యయన కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్ను ఎంచుకున్నారు.
Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లకి ఇసుక సరఫరా విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని indiramma housing scheme ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్పారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టాలని ఆదేశించారు.వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి.. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగేలా చూడాలని ఆదేశించారు.
మరోవైపు.. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూళ్లు కాకపోవడంపైనా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి Revanth reddy ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని అధ్యయన కమిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటికి అవసరమయ్యే ఇసుక, ఇనుము, సిమెంటును లబ్ధిదారులకు తక్కువ ధరలే ఇచ్చే విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థ ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది. ఒక్కో ఇంటికి ఎంత సిమెంటు, ఇనుము, ఇసుక అవసరం అనే అంచనాలను గృహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు..
Redmi 15A 5G : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కు చెందిన సబ్-బ్రాండ్ Redmi భారత మార్కెట్లో తన…
SRH Players : ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్లో జరిగిన ఒక చిన్న సంఘటన…
PNG Connection : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పైప్లైన్ నేచురల్ గ్యాస్ (PNG)పై ప్రజల్లో…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పద్ధతిలోనే ఇరాన్…
Revanth Reddy : తెలంగాణ అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు అదిరిపోయే…
Modi on Iran : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఒక…
Dhurandhar 2 Collections : బాలీవుడ్ Bollywood స్టార్ హీరో రణవీర్ సింగ్ Ranveer Singh నటించిన లేటెస్ట్ యాక్షన్…
Garikapati Narasimha Rao : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తన…
Vidadala Rajini : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజం కాబోతోందా? గత కొద్ది…
Gas Cylinder : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్…
Realme 5G : భారతదేశంలో స్మార్ట్ఫోన్ రంగం రోజురోజుకు విస్తరిస్తుండగా రియల్మీ బ్రాండ్ వేగంగా ఎదుగుతూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.…
Rythu Bharosa : తెలంగాణలో సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు…
This website uses cookies.