EBC : ఈబీసీ వర్గాలకు శుభవార్త.. రూ.50 వేల రుణం, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు
ప్రధానాంశాలు:
EBC : ఈబీసీ వర్గాలకు శుభవార్త.. రూ.50 వేల రుణం, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు
EBC : తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు (BC), మరియు మైనారిటీ వర్గాల యువతకు స్వయం ఉపాధి రుణాలను అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని భావిస్తున్నారు. యువత సాధికారత మరియు ఆర్థికాభివృద్ధికి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రభుత్వం ఈ చొరవ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించింది.
ఈ పథకంలో భాగంగా EBC (ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్) వారికి ప్రభుత్వం 100 శాతం రాయితీతో రూ.50,000 వరకు రుణం అందిస్తోంది. అంటే రుణాలు పొందిన వారు ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు పెద్ద అవకాశం లభిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు, దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్సైట్ https://tgobmmsnew.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి.
ఎంత రుణానికి ఎంత రాయితీ
– ఈ పథకంలో రుణాలు ఎంత తీసుకుంటే ఎంత రాయితీ లభిస్తుందో ప్రభుత్వం వెల్లడించింది. ఒక లక్ష రూపాయల లోపు రుణం తీసుకుంటే 90 శాతం రాయితీ లభించనుంది. అంటే రూ. లక్ష రుణం తీసుకుంటే, లబ్ధిదారుడు కేవలం రూ.10 వేలు మాత్రమే తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
– రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య రుణం తీసుకుంటే 80 శాతం రాయితీ లభిస్తుంది. రూ.2 లక్షలు రుణం తీసుకుంటే, రూ.40 వేలు తిరిగి చెల్లిస్తే చాలు.
– రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల లోపు రుణాలకు 70 శాతం రాయితీ లభిస్తుంది. అంటే, రూ.4 లక్షలు రుణం తీసుకుంటే రూ.1,20,000 తిరిగి చెల్లించాలి.