SLBC : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం విషాదాంతం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SLBC : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం విషాదాంతం

 Authored By prabhas | The Telugu News | Updated on :28 February 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  SLBC : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం విషాదాంతం

SLBC : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం విషాదాంతమైంది. ఈరోజు ఎస్ఎల్‌బీసీ SLBC టన్నెల్‌లో తప్పిపోయిన 8 మంది కార్మికుల మృతదేహాలను గుర్తించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు శుక్ర‌వారం రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగింది. టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేశారు. బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టగా వారి మృతదేహాలు బయటపడ్డాయి.

SLBC ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం విషాదాంతం

SLBC : ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం విషాదాంతం

ఈ రోజు కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్‌ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు. ఈ క్రమంలోనే మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు మీటర్ల లోతు మట్టిలో మృతదేహాలను ఉన్నట్లు గుర్తించారు.

అద్భుతం జరిగితే త‌ప్పా..

SLBC ఘటనలో స‌హాయ‌క చర్య‌ల‌ను ద‌గ్గ‌రుండి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించిన‌ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్ర‌వారం ఉద‌యం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అద్భుతం జరిగితే తప్ప సొరంగంలో చిక్కుకున్న 8 మంది బతికే అవకాశం లేదని అన్నారు. ప్రకృతి వైపరీత్యాన్ని BRS రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, హరీష్ రావు, కేసీఆర్ మృతదేహాలపై పాప్‌కార్న్ పోస్తున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది