Crime News : ఈరోజుల్లో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవ్వరినీ నమ్మేటట్టు లేదు. చివరకు సొంత కుటుంబ సభ్యులను కూడా ఏదైనా చేయడానికి వెనకాడటం లేదు జనాలు. సొంత వాళ్లు, లేని వాళ్లు అనేది లేకుండా స్వార్థం కోసం ఏదైనా చేస్తున్నారు. అందుకే దీన్ని కలికాలం అంటున్నాం. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.. అత్తాకోడళ్ల పంచాయితీ కాస్త తల్లీకొడుకుల వైపు మళ్లింది. అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఉండటం సహజమే కానీ.. ఆ గొడవ యూటర్న్ తీసుకోవడంతో తల్లీకొడుకుల మధ్య గొడవ పెరిగి పెద్దది అయి చివరకు ఏమైందో తెలుసా?
ఈ ఘటన జిల్లాలోని వేంనూరు గ్రామంలో చోటు చేసుకుంది. మహేందర్, నందిని అనే దంపతులు తన తల్లి బుజ్జితో కలిసి నివసిస్తున్నారు. అయితే.. నందిని, బుజ్జికి అస్సలు పడదు. ఇద్దరూ అత్తాకోడళ్లు కావడంతో ఇద్దరి మధ్య చాలా గొడవలు వస్తూ ఉంటాయి. తాజాగా నందిని వండిన కూర బాగోలేదని బుజ్జి చెప్పింది. తనను మందలించింది కూడా. దీంతో వెంటనే భర్త మహేందర్ కు ఫిర్యాదు చేసింది నందిని. మీ అమ్మ నేను వండిన కూర బాగోలేదని తిట్టింది అంటూ భర్త ముందు బావురుమంది.
నా భార్య వండిన కూరనే బాగోలేదంటావా? అంటూ తన తల్లిపై మహేందర్ విరుచుకుపడ్డాడు. మటన్ కొట్టే కత్తితో తన తల్లిపై దాడి చేశాడు. దీంతో బుజ్జికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను గమనించిన స్థానికులు వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత బుజ్జి బంధువులకు ఈ విషయం తెలిసి మహేందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.