
Free Gold Scheme : తెలంగాణ మహిళలకు ఉచిత బంగారు పథకం... శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి...!
Free Gold Scheme : తెలంగాణ రాష్ట్రంలో మహిళ సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరో ముఖ్యమైన ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచిత బంగారం అందజేయనున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు అమలుపై దృష్టి సారించి ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరించడంలో ప్రజా పాలన కార్యక్రమం కీలకంగా మారింది.అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ అందించడంతోపాటు , ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం , అనేక రకాల సంక్షేమ పథకాలను ఇప్పటికే అమలు చేశారు. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా అర్హులైన కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందించడం జరిగింది.
ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గానికి మేలు జరగాలని లక్ష్యంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే దిశగా వినూత్న పథకాలు రూపొందిస్తున్నారు.అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నిబద్ధతకు అనుగుణంగా మహిళల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ పథకాలను ప్రవేశ పెడుతూ వస్తున్నారు.ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇల్లు యోజన పథకాన్ని మార్చి 21న ప్రారంభించాలని అలాగే మహిళలకు ప్రయోజనం చేకూర్చే మరో పథకాన్ని అతి త్వరలోనే ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 12న లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక ఆ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు రకాల కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు.
అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల ద్వారా పెళ్లైన ఆడపిల్లలకు ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ పథకం ద్వారా నగదు అందుకునేవారు . అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు తులం బంగారం కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు నగదు మరియు బంగారు ఆభరణాలు అందుకొనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆడబిడ్డకు న్యాయం జరిగేలా చూడాలని ఈ ప్రాజెక్టు పై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పథకంపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.