Intermediate : ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. క్లారిటీ ఇచ్చిన బోర్డ్..!
ప్రధానాంశాలు:
Intermediate : ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. క్లారిటీ ఇచ్చిన బోర్డ్
Intermediate : తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ మారనుంది. పూర్తి స్థాయిలో మార్పు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. అధికారికంగా సిలబస్ను ఫైనల్ చేశారు. ఇది 2025-2026 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.

Intermediate : ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. క్లారిటీ ఇచ్చిన బోర్డ్..!
Intermediate కీలక మార్పులు..
కేవలం సిలబస్ పరిమితిలోనే కాకుండా, పరీక్షా విధానంలోనూ మార్పులు చేయనున్నారట.. ఇప్పటివరకు పూర్తిగా ఎక్సటర్నల్ పరీక్షల ఆధారంగా జరిగే ఇంటర్ పరీక్షలు ఇక 80 మార్క్స్ ఎక్సటర్నల్, 20 మార్క్స్ ఇంటర్నల్ పద్ధతిలో జరగనున్నాయి. ఇది ముఖ్యంగా ఆర్ట్స్ కోర్సులు, లాంగ్వేజ్ సబ్జెక్టులకు వర్తించనుంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల నిర్ధారిత మార్కుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
ఇంటర్ సిలబస్లో మార్పుకి ప్రభుత్వం ఇంకా తుది ఆమోదం అయితే ఇవ్వలేదు. అయితే ఈ మార్పులకు ముందుగా విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ ఇయర్ సిలబస్ విషయంలో విద్యార్థులకు కొత్త సవాళ్లు మొదలుకానున్నాయి.