Tirumala : గుడ్న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖ అనుమతి
తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనాల కోసం వారానికి రెండు సార్లు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది.తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించక పోవడంపై గత కొద్ది రోజులుగా వస్తోన్న విమర్శలు టీటీడీ చెక్ పెట్టింది. స్వామి దర్శనానికి వారానికి రెండుసార్లు.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది.
Tirumala : గుడ్న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖ అనుమతి
ఈ అంశంలో కొద్ది రోజులుగా తెలంగాణ నేతలు ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్తే తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని.. తమ సిఫారసు లేఖలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతలు సైతం అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖండించారు. తిరుమలలో తెలంగాణ మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని టీటీడీ పునఃపరిశీలించింది.
సాటి తెలుగు రాష్ట్రంపై ఇలాంటి నిర్ణయం సరికాదని భావించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా కోరారు. దీంతో వారానికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. మరోవైపు, టీటీడీపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ నుంచి వచ్చిన భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఉండేదని.. కానీ ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. శ్రీశైలం మల్లన్నను ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. ‘మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం.. ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చింది. మా తెలంగాణ భక్తుల మీద టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు.
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
This website uses cookies.