
Telangana Power : 24 గంటల కరెంటు వెనుక ఉన్న అప్పుల చీకట్లు నష్టాలు ఇవే ..!
Telangana Power : తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ 24 గంటల కరెంటు వెనుక చాలా అప్పులు, నష్టాలు చీకట్లు ఉన్నాయి. పక్క రాష్ట్రాలలో కరెంటు కొరత ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్య అనేది లేదు. అయితే ఈ వెలుగుల వెనుక భరించలేనంత అప్పులు ఉన్నాయని ఇప్పుడు బయటికి వస్తున్నాయి. గత ప్రభుత్వం కరెంటు గురించి గొప్పగా చెప్పుకున్నారు. తాము అధికారంలోకి రాకపోతే కరెంటు సమస్య మళ్లీ మొదలవుతుంది అని అన్నారు. గత పది ఏళ్లలో విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. భారీ మొత్తాన్ని వెచ్చించి కొనటమే తప్ప ఉత్పత్తి చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పులు ఊహించనంతగా పెరిగాయి. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలిరోజు క్యాబినెట్ సమావేశం లో విద్యుత్ సంస్థలు కోట్ల అప్పులో కూరుకుపోవడం చూసి విస్మయం వ్యక్తం చేశారు.
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తొలుత విద్యుత్ సంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను అప్పుల్లో కూర్చారని భారీ మొత్తం వెచ్చించి బయట కొనడమే తప్ప ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. గడిచిన పదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పులు 60 వేల కోట్లకు పైగా పెరిగాయి. రాష్ట్ర విభజన సమయంలో 22 వేల 423 కోట్ల అప్పు ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి వాటి అప్పులు 81 వేల 156 కోట్లకు పెరిగాయి. విద్యుత్ సంస్థల అప్పులకు వడ్డీని నెలకు 1300 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. కేవలం నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నామని చెప్పుకోవడానికి విద్యుత్ సంస్థలను నిండా ముంచారన్న అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది.
కొత్త ప్లాంట్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం తీరు వివాదాస్పదమైంది. యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు. డిజైన్ సరిగా లేదని, బొగ్గు ఎక్కువగా వినియోగించుకొని డిజైన్ వాడడం తో పాటు అటవీ ప్రాంతం డిస్ట్రబ్ అవుతుందని అనుమతులు కూడా రాలేదు. ఆ థర్మల్ ప్లాంట్ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్తు రావాల్సి ఉంది. భద్రాది పవర్ ప్రాజెక్టులో భారీ స్కామ్ జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. బొగ్గు సరఫరా చేస్తున్న సింగరేణి సంస్థలకు వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన 21 వేల కోట్ల పైనే ప్రభుత్వం విద్యుత్ తమ ఇష్టానుసారంగా వాడుకుంది. ఇప్పటివరకు ఆ బిల్లులను చెల్లించలేదు. ప్రభుత్వ విద్యుత్ వాడుకున్నందుకు 21 వేల కోట్ల పైగా విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ లెక్కలను సరి చేస్తుందో లేదో చూడాలి.
Redmi 15A 5G : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కు చెందిన సబ్-బ్రాండ్ Redmi భారత మార్కెట్లో తన…
SRH Players : ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్లో జరిగిన ఒక చిన్న సంఘటన…
PNG Connection : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పైప్లైన్ నేచురల్ గ్యాస్ (PNG)పై ప్రజల్లో…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పద్ధతిలోనే ఇరాన్…
Revanth Reddy : తెలంగాణ అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు అదిరిపోయే…
Modi on Iran : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఒక…
Dhurandhar 2 Collections : బాలీవుడ్ Bollywood స్టార్ హీరో రణవీర్ సింగ్ Ranveer Singh నటించిన లేటెస్ట్ యాక్షన్…
Garikapati Narasimha Rao : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తన…
Vidadala Rajini : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజం కాబోతోందా? గత కొద్ది…
Gas Cylinder : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్…
Realme 5G : భారతదేశంలో స్మార్ట్ఫోన్ రంగం రోజురోజుకు విస్తరిస్తుండగా రియల్మీ బ్రాండ్ వేగంగా ఎదుగుతూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.…
Rythu Bharosa : తెలంగాణలో సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు…
This website uses cookies.