
Brahmotsavams : ఘనంగా శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు..!
Brahmotsavams : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఏదులాబాద్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. మాజీ ఎంపీటీసీ కందుల కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ జడ్పీ ఛైర్మెన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, ముల్లి పావని జగ్గయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామిడ్ల ముత్యాలు యాదవ్, మాజీ కార్పొరేటర్ భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరంతా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Brahmotsavams : ఘనంగా శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత మన్నార్ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు..!
మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఏదులాబాద్ గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించడం ఒక గొప్ప సంప్రదాయమని, ఈ ఉత్సవాలు గ్రామస్తులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, సామరస్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ మాట్లాడుతూ, ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవాలని, స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ధార్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని, సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
కందుల కుమార్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనను అభినందించారు. ఈ ఉత్సవాలకు గ్రామస్తులే కాకుండా, పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. రంగురంగుల పూలతో అలంకరించిన రథంపై స్వామివారు కనువిందు చేశారు. భక్తులు స్వామివారికి హారతులు సమర్పించి, పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.