Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం..!
Kakatiya University : ములుగు జిల్లా : ములుగు జిల్లాలోని మహర్షి డిగ్రీ కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందనే ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ఈ కళాశాలలో విద్యార్థులు తరగతులకు హాజరుకాని, సిలబస్ గురించి ఏ మాత్రం అవగాహన లేకపోయినా, వారికి ఇంటర్నల్ ప్రాక్టికల్ పరీక్షల్లో డబ్బులు తీసుకుని మార్కులు కేటాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, సంఘటిత విద్యార్థి నాయకులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ సహకారంతో ఈ అక్రమాలు నడుస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు కనీసం తరగతులు నిర్వహించకుండా, స్కాలర్షిప్ డబ్బులు పొందేందుకు హాజరు నమోదు చేయించుకుంటూ, వారితో సంతకాలు పెట్టించుకుంటూ, అవతల వారు విద్యార్థులను ప్రమోట్ చేస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Kakatiya University : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం..!
ఈ కళాశాలలో విద్యార్థుల హాజరు కోసం తప్పుడు బయోమెట్రిక్ రికార్డులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. వారిని తరగతులకు రాకుండా ఉంచి, పరీక్షల్లో నైపుణ్యం లేకపోయినా లంచం ద్వారా మార్కులు కేటాయించడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. విద్యను వ్యాపారంగా మార్చుకుని, డబ్బుల కోసమే విద్యార్థుల జీవితాలను ముప్పు పెడుతున్న ప్రైవేట్ కళాశాలల ధోరణి మీద విద్యార్థి సంఘాలు విరుచుకుపడుతున్నాయి.
ఈ అవకతవకలపై కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, వైస్ ఛాన్సలర్ వెంటనే స్పందించి, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తప్పుడు హాజరు నమోదు చేసే కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యా నియంత్రణ సంస్థలను కోరుతున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకు రాకుండా ఉంచి, కేవలం మార్కుల కోసం అక్రమ మార్గాలు అవలంబించడం విద్యార్థులకు మేలు చేయదని, దీని వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు దూరమవుతాయని అంటున్నారు. విద్యార్హతలు లేనివారు దేశ భవిష్యత్తును నాశనం చేయడమే తప్ప ప్రయోజనం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విద్యా అవకతవకలను నియంత్రించేందుకు ప్రభుత్వం, విద్యా నియంత్రణ సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు సరైన విద్యను అందించేలా ప్రభుత్వ విధానాలను కఠినంగా అమలు చేయాలి. విద్యార్థులు రేపటి పౌరులు – దేశ భవిష్యత్తు. వారి జీవితాలతో చెలగాటమాడే ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమాలకు పాల్పడే కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.