what doctors said after operation to kcr in yashoda
KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం యశోధ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన ఎడమ కాలు తుంటికి ఆపరేషన్ చేశారు. హిప్ రీప్లేస్ మెంట్ చేశారు డాక్టర్లు. కేసీఆర్ కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్ కు ట్రీట్ మెంట్ చేస్తోంది. నిన్న కేసీఆర్ కు సర్జరీ చేశారు. అది విజయవంతం అయింది. ఆ తర్వాత ఇవాళ కేసీఆర్ ను నిలబెట్టి వాకర్ తో నడిపించే ప్రయత్నం చేశారు డాక్టర్లు. ఆయనకు కాసేపు నడక ప్రాక్టీస్ చేయించారు. డిసెంబర్ 7న రాత్రి తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇంట్లో కేసీఆర్ బాత్ రూమ్ కు వెళ్లి కాలుజారి పడ్డారు. దీంతో తన ఎడమ కాలు తుంటి విరిగింది. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వెంటనే తెల్లారి డిసెంబర్ 8న డాక్టర్లు కేసీఆర్ కు తుంటి ఆపరేషన్ చేసి హిప్ ను రీప్లేస్ చేశారు.
కేసీఆర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనతోనే ఉన్నారు కేటీఆర్. కేసీఆర్ భార్య, కేసీఆర్ కూతురు కవిత, మనవడు హిమాన్షు అందరూ వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి అక్కడే ఉన్నారు. కేటీఆర్ అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. కేసీఆర్ కు అలా జరిగిందని తెలుసుకొని వెంటనే బీఆర్ఎస్ అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసీఆర్ వెంటనే బాగుపడాలని దేవుడిని ప్రార్థించారు. హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా వెంటనే యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు.
సర్జరీ తర్వాత యశోద డాక్టర్లు కేటీఆర్ తో మాట్లాడారు. కేటీఆర్ కు సర్జరీ చేసిన విధానాన్ని వివరించారు. హిప్ రీప్లేస్ మెంట్ ఎందుకు చేశామో తెలిపారు. రీప్లేస్ చేయడానికి గల కారణాలు కేటీఆర్ కు తెలిపారు. కేసీఆర్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని.. కొన్ని వారాల్లో ఆయన మామూలు వ్యక్తిలా నడుస్తారని చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
This website uses cookies.