KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం యశోధ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన ఎడమ కాలు తుంటికి ఆపరేషన్ చేశారు. హిప్ రీప్లేస్ మెంట్ చేశారు డాక్టర్లు. కేసీఆర్ కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్ కు ట్రీట్ మెంట్ చేస్తోంది. నిన్న కేసీఆర్ కు సర్జరీ చేశారు. అది విజయవంతం అయింది. ఆ తర్వాత ఇవాళ కేసీఆర్ ను నిలబెట్టి వాకర్ తో నడిపించే ప్రయత్నం చేశారు డాక్టర్లు. ఆయనకు కాసేపు నడక ప్రాక్టీస్ చేయించారు. డిసెంబర్ 7న రాత్రి తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇంట్లో కేసీఆర్ బాత్ రూమ్ కు వెళ్లి కాలుజారి పడ్డారు. దీంతో తన ఎడమ కాలు తుంటి విరిగింది. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వెంటనే తెల్లారి డిసెంబర్ 8న డాక్టర్లు కేసీఆర్ కు తుంటి ఆపరేషన్ చేసి హిప్ ను రీప్లేస్ చేశారు.
కేసీఆర్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనతోనే ఉన్నారు కేటీఆర్. కేసీఆర్ భార్య, కేసీఆర్ కూతురు కవిత, మనవడు హిమాన్షు అందరూ వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి అక్కడే ఉన్నారు. కేటీఆర్ అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. కేసీఆర్ కు అలా జరిగిందని తెలుసుకొని వెంటనే బీఆర్ఎస్ అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసీఆర్ వెంటనే బాగుపడాలని దేవుడిని ప్రార్థించారు. హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా వెంటనే యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు.
సర్జరీ తర్వాత యశోద డాక్టర్లు కేటీఆర్ తో మాట్లాడారు. కేటీఆర్ కు సర్జరీ చేసిన విధానాన్ని వివరించారు. హిప్ రీప్లేస్ మెంట్ ఎందుకు చేశామో తెలిపారు. రీప్లేస్ చేయడానికి గల కారణాలు కేటీఆర్ కు తెలిపారు. కేసీఆర్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని.. కొన్ని వారాల్లో ఆయన మామూలు వ్యక్తిలా నడుస్తారని చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.