KCR : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో గురువారం రాత్రి బాత్ రూమ్ లో కాలు జారి ఆయన కింద పడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలు తుంటికి గాయం అయింది. దీంతో హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీని కేసీఆర్ కు నిర్వహించారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. సర్జరీని శుక్రవారమే నిర్వహించారు. సర్జరీ సక్సెస్ అయంది. ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేదని.. తుంటి మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతం అయినట్టు డాక్టర్లు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు డాక్టర్లు కేసీఆర్ కు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
కేసీఆర్ ను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి ఆపరేషన్ అయ్యేంత వరకు, ఆ తర్వాత ఇప్పటికీ కేటీఆర్, ఆయన కొడుకు హిమాన్షు, కేసీఆర్ తల్లి, కవిత, హరీశ్ రావు, సంతోష్ కుమార్.. బీఆర్ఎస్ ముఖ్య నేతలు అందరూ ఆసుపత్రిలోనే ఉన్నారు. తుంటి మార్పిడి సర్జరీ పూర్తయ్యాక కేసీఆర్ ను వేరే రూమ్ కు షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం డాక్టర్లు కేసీఆర్ కు నడక నేర్పించారు. ఉదయమే వాకర్ సాయంతో నడకను ప్రాక్టీస్ చేయించారు. వాకర్ సాయంతో కేసీఆర్ మెల్లగా అడుగులు వేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యశోద ఆసుపత్రికి చెందిన సీనియర్ ఆర్ధోపెడిక్ డాక్టర్లు, కేసీఆర్ కు ట్రీట్ మెంట్ చేశారు.
ఇక.. కేసీఆర్ కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఒకవేళ ఆయన 6 వారాలు ఆసుపత్రిలోనే ఉంటారా? లేక ఇంటికి తీసుకెళ్తారా? అనేది తెలియదు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.