
AIYF : గద్దర్ ను విమర్శించిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఏఐవైఎఫ్
AIYF : కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Bandi Sanjay సాంస్కృతిక ప్రజా యుద్ధ నౌక గద్దర్ Gaddar ను అవమానించేలా వివాదాస్పద వ్యాఖ్యలకు మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ భేషరతుగా వెనక్కి తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. గద్దర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా AIYF ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి వై జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ లు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ సంస్కృతిని, సమాజాన్ని అవమానపర్చేలా హోదాను మర్చి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
AIYF : గద్దర్ ను విమర్శించిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఏఐవైఎఫ్
భారత రాజ్యాంగం సాక్షిగా పార్లమెంట్ సభ్యుడు గా ఎన్నికైన బండి, కేంద్ర పురస్కార అవార్డు ల అంశంలో ఏ అధికారంతో గద్దర్ గురించి ప్రస్తావించారో తెలపాలని డిమాండ్ చేశారు. కేంద్ర అవార్డులు మొత్తం స్వతంత్ర సంస్థ ద్వారా ఎంపిక చేస్తారని,ఆయా రంగాలలో విశిష్ట సేవలకు గాను ప్రధానం చేస్తారే గాని… బండి సంజయ్ చెబితే అవార్డులు ఇవ్వరని వారు స్పష్టంచేశారు. కానీ, ఇవన్నీ తెలిసిన మంత్రి ఇలాంటి వివాదాస్పదంగా మాట్లాడటం అప్ప్రజాస్వామికమన్నారు.ఒకవేళ బీజేపీ నేతలు చెప్పిన వాళ్లకే అవార్డుల ప్రధానం జరిగితే ఈ దేశంలో ద్వంద్వ విధానాలను, విభజన రాజకీయాలను ప్రోస్తహిస్తున్నట్లే అని వారు ఆరోపించారు.
దేశంలో హిందూత్వం పేరుతో అణగారిన వర్గాల ప్రజలను గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో మారణహోమం చేసిన బీజేపీ ఈ దేశానికి ప్రమాదమని వారు ఉద్ఘాటించారు.దేశ స్వాతంత్ర్యం లో బీజేపీ పాత్రే లేదని, దేశంలో జరిగిన ఏ పోరాటంలో బీజేపీ పాత్ర లేకున్నా చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తూ దేశంలో మత అజెండాను అవలంభిస్తున్నారని అన్నారు. అందుకే బండి సంజయ్ బహిరంగంగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష,కార్యదర్శి మధు, పి. శివ కుమార్.. కార్యవర్గ సభ్యులు కళ్యాణ్, అనీల్ కుమార్, హేమంత్ కుమార్, అరుణ్, భగత్ సింగ్, వీరేశ్, భాను, భాను ప్రకాష్,సంజయ్, నగేష్, శివ కుమార్,వంశీ,గణేష్, చెట్టుకింద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
This website uses cookies.