AIYF : గద్దర్ ను విమర్శించిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఏఐవైఎఫ్
AIYF : కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Bandi Sanjay సాంస్కృతిక ప్రజా యుద్ధ నౌక గద్దర్ Gaddar ను అవమానించేలా వివాదాస్పద వ్యాఖ్యలకు మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ భేషరతుగా వెనక్కి తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. గద్దర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా AIYF ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి వై జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ లు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ సంస్కృతిని, సమాజాన్ని అవమానపర్చేలా హోదాను మర్చి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
AIYF : గద్దర్ ను విమర్శించిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఏఐవైఎఫ్
భారత రాజ్యాంగం సాక్షిగా పార్లమెంట్ సభ్యుడు గా ఎన్నికైన బండి, కేంద్ర పురస్కార అవార్డు ల అంశంలో ఏ అధికారంతో గద్దర్ గురించి ప్రస్తావించారో తెలపాలని డిమాండ్ చేశారు. కేంద్ర అవార్డులు మొత్తం స్వతంత్ర సంస్థ ద్వారా ఎంపిక చేస్తారని,ఆయా రంగాలలో విశిష్ట సేవలకు గాను ప్రధానం చేస్తారే గాని… బండి సంజయ్ చెబితే అవార్డులు ఇవ్వరని వారు స్పష్టంచేశారు. కానీ, ఇవన్నీ తెలిసిన మంత్రి ఇలాంటి వివాదాస్పదంగా మాట్లాడటం అప్ప్రజాస్వామికమన్నారు.ఒకవేళ బీజేపీ నేతలు చెప్పిన వాళ్లకే అవార్డుల ప్రధానం జరిగితే ఈ దేశంలో ద్వంద్వ విధానాలను, విభజన రాజకీయాలను ప్రోస్తహిస్తున్నట్లే అని వారు ఆరోపించారు.
దేశంలో హిందూత్వం పేరుతో అణగారిన వర్గాల ప్రజలను గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో మారణహోమం చేసిన బీజేపీ ఈ దేశానికి ప్రమాదమని వారు ఉద్ఘాటించారు.దేశ స్వాతంత్ర్యం లో బీజేపీ పాత్రే లేదని, దేశంలో జరిగిన ఏ పోరాటంలో బీజేపీ పాత్ర లేకున్నా చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తూ దేశంలో మత అజెండాను అవలంభిస్తున్నారని అన్నారు. అందుకే బండి సంజయ్ బహిరంగంగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష,కార్యదర్శి మధు, పి. శివ కుమార్.. కార్యవర్గ సభ్యులు కళ్యాణ్, అనీల్ కుమార్, హేమంత్ కుమార్, అరుణ్, భగత్ సింగ్, వీరేశ్, భాను, భాను ప్రకాష్,సంజయ్, నగేష్, శివ కుమార్,వంశీ,గణేష్, చెట్టుకింద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.