Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :23 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ ఉద్యోగి పరారీలో ఉన్నాడు. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ (32) ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. ఐశ్వర్యతో అతడికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది.

Wife తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : పెద్ద స్కెచ్చే..

ఐశ్వర్య మాయమాటలు నమ్మి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన తేజేశ్వర్‌ ఆమెనే పెళ్లి చేసకుంటానని పట్టుబట్టాడు. తల్లిదండ్రుల అభ్యంతరాలను కాదని పెద్దల సమక్షంలోనే మే 18న బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన రెండో రోజు నుంచే తేజేశ్వర్, ఐశ్వర్యల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐశ్వర్య నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ.. భర్తను పట్టించుకోకపోవడంతో ఈ గొడవలు తలెత్తాయి.ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. తేజేశ్వర్ కుటుంబసభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను, ఆమె తల్లి సుజాతను విచారించారు. విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తుండగా.. అదే బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న తిరుమలరావుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. సదరు ఉద్యోగి తల్లి సుజాతతో పాటుగా.. కూతురు ఐశ్వర్యను కూడా ట్రాప్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్‌ను అడ్డు తొలగిస్తే అతడి ఆస్తి తమ సొంతమవుతుందని భావించిన ఐశ్వర్య హత్యకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. తిరుమల రావు కొందరికి సుపారీ ఇచ్చి తన డ్రైవర్‌ను వారి వెంట పంపినట్లు తెలిసింది. జూన్ 17న కొంతమంది వ్యక్తులు తేజేశ్వర్‌ను కలిసి 10 ఎకరాల పొలం సర్వే చేయాలని చెప్పి గద్వాల నుంచి కారులో తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేసి గొంతుకోసి చంపేసి, మృతదేహాన్ని పాణ్యం సమీపంలో పారవేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది