AP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు అనంతరం.. టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడులతో ఏపీ అట్టుడుకుతున్నది. ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీల కార్యాలయాలపై ఇలా దాడులు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది.టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులను నిరసిస్తూ బుధవారం రాష్ట్రబంద్కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. కాగా, బంద్ చేస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారట.
అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తనకు సమాచారం అందలేదని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడులకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని, అలా చేస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటామని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రాబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. అమిత్ షాతో అపాయింట్మెంట్ కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏపీ రాజకీయం ఇప్పుడు ఢిల్లీ వరకు చేరిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, టీడీపీ ఫిర్యాదు నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించనున్నది అనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వంపై చర్యలకు పూనుకుంటుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాడు. ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం 36 గంటల దీక్ష చేయనున్నారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట చంద్రబాబు గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు దీక్షను టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.