Chandrababu
AP: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు అనంతరం.. టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడులతో ఏపీ అట్టుడుకుతున్నది. ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీల కార్యాలయాలపై ఇలా దాడులు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది.టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడులను నిరసిస్తూ బుధవారం రాష్ట్రబంద్కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. కాగా, బంద్ చేస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారట.
Chandrababu
అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తనకు సమాచారం అందలేదని అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడులకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని, అలా చేస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటామని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రాబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. అమిత్ షాతో అపాయింట్మెంట్ కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏపీ రాజకీయం ఇప్పుడు ఢిల్లీ వరకు చేరిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, టీడీపీ ఫిర్యాదు నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించనున్నది అనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వంపై చర్యలకు పూనుకుంటుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
BJP
బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాడు. ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం 36 గంటల దీక్ష చేయనున్నారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట చంద్రబాబు గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు దీక్షను టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.