Chandrababu : ఆంధప్రదేశ్లో రాజకీయం రోజుకో రకంగా మారిపోతున్నది. అసలు సమస్యలు పక్కకుపోయి పార్టీల మధ్య మాటల యుద్ధాలు పెరిగిపోయి అవి దాడుల వరకు చేరుకున్నాయి. మొన్నటి వరకు మాటల పర్వం కొనసాగగా ప్రస్తుతం దూషణలు, హింస పర్వానికి చేరుకుంది.టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాంతో మాటల యుద్ధం కాస్తా భౌతిక దాడుల వరకు చేరుకుంది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైన, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. అయితే, అసలు ఇలా జరగడానికి మూల కారణం నేతలు సంయమనం కోల్పోవడమేనని తెలుస్తోంది.
టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి ముఖ్యమంత్రిపైన దూషణలు చేయడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొనకపోగా, తమ నేతలను వైసీపీ వారు దూషిస్తున్నారంటూ ప్రశ్నించారు. అలా పరోక్షంగా నేతల దూషణలను చంద్రబాబు సపోర్ట్ చేసినట్లు అయింది. ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రతిపక్ష పార్టీ ఆఫీసులపై దాడి చేయడం గురించి తగిన స్థాయిలో స్పందించకపోవడం సరికాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉంటాయి కానీ ఇలా దాడులు చేయడం ఏంటనే ప్రశ్న తలెత్తుతున్నది. పట్టాభి వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బదులుగా ఇలా భౌతికమైన దాడులకు దిగడం సమంజసం కాదని పలువురు అంటున్నారు. ఇలా దాడుల పర్వం కొనసాగితే ఏపీలో అరాచకాలు ఇంకా పెరిగిపోయే చాన్సెస్ మెండుగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ఇలా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపైన దాడి చేయడం మంచి సంప్రదాయమేనా అని ఆలోచన చేసుకోవాల్సి ఉంది.
అయితే, ఈ దాడుల విషయంలో అధికారి వైసీపీ, ప్రతిపక్ష వైసీపీ రెండు పార్టీలు కూడా సంయమనం పాటించాల్సిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పోలీసులపైన ఫైర్ కావల్సిన అవసరం ఇరు పార్టీల నేతలకు లేదని చెప్తున్నారు. ఇకపోతే రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున వాదనను, సిద్ధాంతాలను బలంగా వినిపించే, సభ్యతతో మాట్లాడనే నేతలను మాత్రమే అధికార ప్రతినిధులుగా నియమించుకోవాలని సూచిస్తున్నారు. దూషణలు చేసే వారిని, తిట్ల దండకం ఎత్తుకునే వారిని, ముఖ్యమంత్రిని సైతం తూలనాడటం చేయొద్దని ఆయా పార్టీల అధ్యక్షులు చెప్పాలని అంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.