
YS Jagan comments on Pawan Kalyan and ChandraBabu naidu
Chandrababu : ఆంధప్రదేశ్లో రాజకీయం రోజుకో రకంగా మారిపోతున్నది. అసలు సమస్యలు పక్కకుపోయి పార్టీల మధ్య మాటల యుద్ధాలు పెరిగిపోయి అవి దాడుల వరకు చేరుకున్నాయి. మొన్నటి వరకు మాటల పర్వం కొనసాగగా ప్రస్తుతం దూషణలు, హింస పర్వానికి చేరుకుంది.టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాంతో మాటల యుద్ధం కాస్తా భౌతిక దాడుల వరకు చేరుకుంది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైన, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. అయితే, అసలు ఇలా జరగడానికి మూల కారణం నేతలు సంయమనం కోల్పోవడమేనని తెలుస్తోంది.
chandrababu Ys jagan in same way
టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండి ముఖ్యమంత్రిపైన దూషణలు చేయడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొనకపోగా, తమ నేతలను వైసీపీ వారు దూషిస్తున్నారంటూ ప్రశ్నించారు. అలా పరోక్షంగా నేతల దూషణలను చంద్రబాబు సపోర్ట్ చేసినట్లు అయింది. ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రతిపక్ష పార్టీ ఆఫీసులపై దాడి చేయడం గురించి తగిన స్థాయిలో స్పందించకపోవడం సరికాదనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉంటాయి కానీ ఇలా దాడులు చేయడం ఏంటనే ప్రశ్న తలెత్తుతున్నది. పట్టాభి వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బదులుగా ఇలా భౌతికమైన దాడులకు దిగడం సమంజసం కాదని పలువురు అంటున్నారు. ఇలా దాడుల పర్వం కొనసాగితే ఏపీలో అరాచకాలు ఇంకా పెరిగిపోయే చాన్సెస్ మెండుగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ఇలా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపైన దాడి చేయడం మంచి సంప్రదాయమేనా అని ఆలోచన చేసుకోవాల్సి ఉంది.
Ys jagan
అయితే, ఈ దాడుల విషయంలో అధికారి వైసీపీ, ప్రతిపక్ష వైసీపీ రెండు పార్టీలు కూడా సంయమనం పాటించాల్సిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పోలీసులపైన ఫైర్ కావల్సిన అవసరం ఇరు పార్టీల నేతలకు లేదని చెప్తున్నారు. ఇకపోతే రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున వాదనను, సిద్ధాంతాలను బలంగా వినిపించే, సభ్యతతో మాట్లాడనే నేతలను మాత్రమే అధికార ప్రతినిధులుగా నియమించుకోవాలని సూచిస్తున్నారు. దూషణలు చేసే వారిని, తిట్ల దండకం ఎత్తుకునే వారిని, ముఖ్యమంత్రిని సైతం తూలనాడటం చేయొద్దని ఆయా పార్టీల అధ్యక్షులు చెప్పాలని అంటున్నారు.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.