Ysrcp : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిసొంతా పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలోనే విమర్శలు చేశారు. దివంగత సీఎం వైఎస్ సమకాలీనుడిగా ఉన్న రవీంద్రారెడ్డి ఇటువంటి విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.వైసీపీలోనే ఉన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చాలా కాలం తర్వాత మీడియా ముందరకు వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రవీంద్రారెడ్డి మైదుకూరులో ఆ పార్టీ అభ్యర్థి కోసం పని చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వైసీపీ పాలన గాడి తప్పుతున్నదని, రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతున్నదని ప్రశ్నించారు. ఏపీలో మంత్రులు ఏం చేయడం లేదని, అన్ని శాఖల తరఫున మంత్రిగా ఒకరే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షణంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి చేసినవని స్థానికంగా చర్చించుకుంటున్నారు. పేదల భూములను వైసీపీ శాసన సభ్యులే బెదిరించి రాయించుకుంటున్నారని ఆరోపించారు. దువ్వూరులో వైసీపీ ఎమ్మెల్యే రూ.80 లక్షల విలువ చేసే రెండెకరాల ల్యాండ్ తన పేరిట రాయించుకున్నారని ఆరోపించారు. వైసీపీ శాసన సభ్యులే ఎస్సీ, ఎస్టీల భూములను లాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్పై ఏపీ సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఉన్నత శాఖల అధికారులు వెన్నుముక లేని వారుగా తయారయ్యారని ఆరోపించారు. సీఎం జగన్ మంత్రులకే అపాయింట్మెంట్ లేకపోతే, తనలాంటి వ్యక్తులకు దొరకడం చాలా కష్టం కదా అని రవీంద్రారెడ్డి అన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకున్న నేపథ్యంలో వస్తానని ప్రకటించారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో తాను మైదుకూరు శాసన సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. వైఎస్ ఫ్యామిలీతో తనకు రిలేషన్ లేకపోయినప్పటికీ రెడ్లకు మంచి జరుగుతుందని, తాను వైసీపీకి మద్దుతు ఇచ్చినట్లు రవీంద్రారెడ్డి తెలిపారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.