TRS Party : ఖమ్మం కారులో కుమ్ములాట.. ఎవరికి వారే ఆధిపత్య పోరు

TRS Party : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు స్టీరింగ్ తిప్పే వారు చాలా మంది అయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా టీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకూ నేతల మధ్య అంతర్గత పోరు ఎక్కువవుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలు టీఆర్ఎస్ పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో చర్ఛనీయాంశంగా మారాయి.

khammam squatting in the-car who is fighting for supremacy

TRS Party : తాజా, మాజీల మధ్య పోరు.. !

ఇటీవల ఓ సమావేశంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటానని, పదవి లేదని బెడ్ షీట్ కప్పుకుని ఇంట్లో పడుకోబోనని చెప్పారు. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా తాను ప్రజల్లోనే తిరుగుతూ ఉంటానని, తాను పార్టీ మనిషినని చెప్పుకొచ్చారు. తనకు ఈ రోజు పదవి లేదని అయితే తాను పార్టీ అధినేతను నమ్మకున్నానని, మీరు కూడా అలాగే చేయాలని, ఎవరో మీద పదువులు తీసేస్తారని దిగులు పడొద్దని టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి పొంగులేటి అన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీకి తననే మోడల్‌గా తీసుకోవాలని, పార్టీ బలోపేతం దిశగా అందరం కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి మాటలను బట్టి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని స్పష్టమవుతున్నది.

khammam squatting in the-car who is fighting for supremacy

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలందరు ఎవరి వర్గాన్ని వారు కాపు కాస్తూనే తమ సత్తా చాటేందుకు, తమ ఉనికిని నిలుపుకునేందుకుగాను ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం జిల్లా రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ లోకసభ పక్షనేత నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఉన్నారు.ఈ క్రమంలోనే సీనియర్ నేతలు ఎక్కువయ్యారని, తాజా, మాజీల మధ్య పోరు అంతర్గతంగా ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తుమ్మల, పొంగులేటి, జలగం వర్గాలు ఉన్నాయని వారందరికీ సెపరేట్ గ్రూపులు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య పోరు ఉందని రాజకీయ వర్గాలతో పాటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని టీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయంపై అధిష్టానం దృష్టి సారించాలని టీఆర్ఎస్ శ్రేణులు కోరుతున్నాయి.

Recent Posts

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

40 minutes ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

2 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

3 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

4 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

5 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

6 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

7 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

7 hours ago