Girls fight in class : సోషల్ మీడియా మనిషికి ఒక డ్రగ్ అడిక్ట్లా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్, ఫన్నీ వీడియోస్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారని తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్లో నెట్ ఉంటే చాలు అసలు ఈరోజుల్లో టైమే తెలియడం లేదు. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. ఇక సోషల్ మీడియాకు నేటితరం బానిసల్లా మారిపోతున్నారనడంలో ఏంమాత్రం అతిశయోక్తి లేదు.
ముఖ్యంగా చదువుకునే విద్యార్థినీవిద్యార్థులు సోషల్ మీడియా వినియోగం వలన వారికి క్రమశిక్షణ లేకుండా పోతోంది. కొందరు ప్రతి చిన్న విషయాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తరగతిలో ఎలా ఉండాలి. ఇంట్లో ఎలా ఉండాలనే విషయాలు కూడా నేటితరం స్టూడెంట్స్కు తెలియడం లేదని ఈ వీడియోను చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది.
మన విద్యా వ్యవస్థ అద్వానంగా ఉండటం కూడా పిల్లలపై సామాజిక దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా పడుతోందని ఇట్టే అర్థం అవుతోంది. తరగతిలోనే దేశ భవిష్యత్కు పునాదులు పడుతుంటాయని మహానుభావులు చెప్పిన విషయాన్ని విద్యావంతులే విస్మరిస్తున్నారు. విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వారు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. దీనంతటికీ సోషల్ మీడియా ప్రభావం వారిపై ఎంతో కొంత ఉంటుందని కూడా అంటున్నారు.
తాజాగా యూపీలోని కాన్పూర్లో ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన ఆడ పిల్లలు జుట్లు పట్టుకుని మరీ విపరీతంగా దెబ్బలాడుకున్నారు. తాము ఉన్నది తరగతి గది అని మర్చిపోయారు. జుట్లు లాక్కుంటూ వారు కొట్టుకుంటున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు కోట్టుకోవద్దని, ఆపాలని ఎంత చెబుతున్నా వినకుండా వారు చేసేది వారు చేశారు. ఈ ఉదంతాన్ని తరగతి గదిలోని మరో విద్యార్థిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. స్కూల్ టీచర్లు విద్యార్థులను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం వల్లే ఇలా జరిగిందని.. అసలు తరగతి గదిలోకి ఫోన్లు ఎందుకు అనుమతి ఇచ్చారని కూడా కొందరు విమర్శిస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.