Viral Video : దివ్యాంగులు కనిపిస్తే ఎవ్వరైనా వాళ్లకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వాళ్లకు చేతనైన సాయం చేస్తాం. కనీసం వాళ్లకు మాట సాయం అయినా చేస్తాం. ఒకవేళ వాళ్లకు ఏదైనా ఫిజికల్ హెల్ప్ కావాలన్నా చేస్తాం. కానీ.. వాళ్లను బాధపెట్టం. వాళ్లను తిట్టం, కొట్టం. ఎందుకంటే.. వాళ్లు దివ్యాంగులు. వాళ్లకు కాళ్లు లేదా చేతులు పని చేయవు. వాళ్లకు ఏదో ఒక లోపం ఉంటుంది. అటువంటి వాళ్లను మనం బాధపెట్టడం కరెక్ట్ కాదు. కానీ.. ఈ పోలీసులు మాత్రం ఒక వికలాంగుడిని పట్టుకొని చితకబాదారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రైసైకిల్ పై వెళ్తున్న దివ్యాంగుడిని డ్యూటీలో ఉన్న పీఆర్డీ జవాన్లు కొట్టారు. ఆయన్ను దుర్భాషలాడారు. ఇద్దరు పీఆర్డీ జవాన్లు ట్రైసైకిల్ పై వెళ్తున్న దివ్యాంగుడిని ఆపి మరీ కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. డియోరియా జిల్లా రుద్రపూర్ కొత్వాలిలోని ఖజువా చౌరాహాలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వికలాంగుడిపై దాడి చేసిన ఆ జవాన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు వాళ్లు ఎందుకు అతడిపై దాడి చే శారో మాత్రం తెలియలేదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రాంతీయ రక్షక్ దళ్ జవాన్లు అయి ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటంటూ స్థానికులు కూడా మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు కూడా ఆ వీడియోను చూసి ఆ జవాన్లపై దర్యాప్తును ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.