Annadata Sukhibhava Scheme : అన్నదాత సుఖీభవ పథకం.. వచ్చాయా.. లేదా ఇలా చెక్ చేసుకోండి..!
Annadata Sukhibhava Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద డబ్బులు పొందడానికి రైతులు ఈ నెల 20వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేయాలని తొలుత చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే ఈ కేవైసీ చేసుకోవాలని తెలిపింది.

Annadata Sukhibhava Scheme : అన్నదాత సుఖీభవ పథకం.. వచ్చాయా.. లేదా ఇలా చెక్ చేసుకోండి..!
Annadata Sukhibhava Scheme స్టేటస్ చెక్..
ఈ లిస్టుల్ని రైతు సేవా కేంద్రాలకు(ఆర్ఎస్కే) పంపించారు. దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయ్యింది. వివరాలు లేనివారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో అధికారులు ఈకేవైసీ జాబితాలను అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హులతో అనుసంధానించారు..ఈ మేరకు 97 శాతం వరకు ఈకేవైసీ పూర్తయింది అంటున్నారు.
అన్నదాత సుఖీభ పథకానికి తాము అర్హులమో కాదోనని చాలా మంది రైతులు కంగారు పడ్డారు. అందుకే ప్రభుత్వం చెక్ స్టేటస్ అనే ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కోసం రైతులు ప్రభుత్వ వెబ్సైట్ https://annadathasukhibhava.ap.gov.in లోకి వెళ్లి.. చెక్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. రైతు తన ఆధార్ నంబర్ నమోదు చేసి.. పక్కనే ఉండా కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ అనర్హులుగా తేలితే రైతు సేవా కేంద్రంలో సంపద్రించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పిస్తుంది అంటున్నారు.