Andhra Pradesh : గుడ్న్యూస్.. ఏపీకి వేల కోట్ల నిధులు అందజేయబోతున్న కేంద్రం.. ఇంతకన్నా ఏమికావాలి !!
ప్రధానాంశాలు:
Andhra Pradesh : గుడ్న్యూస్.. ఏపీకి వేల కోట్ల నిధులు అందజేయబోతున్న కేంద్రం.. ఇంతకన్నా ఏమికావాలి !!
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా 16వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి భారీ సిఫార్సులు చేసింది. బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తిగా ఉన్న తరుణంలో, రాష్ట్రానికి ఏకంగా రూ. 28,785 కోట్ల నిధులు గ్రాంట్ల రూపంలో అందించాలని సూచించడం విశేషం. ఈ నిధులలో గ్రామీణ స్థానిక సంస్థలకు (పంచాయతీలకు) రూ. 16,627 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు (మున్సిపాలిటీలకు) రూ. 12,158 కోట్లు కేటాయించారు. కేంద్రం ఈ సిఫార్సులను గనుక అమలు చేస్తే, నిధుల లేమితో సతమతమవుతున్న గ్రామ పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడమే కాకుండా, క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టే అవకాశం ఉంది.
Andhra Pradesh : గుడ్న్యూస్.. ఏపీకి వేల కోట్ల నిధులు అందజేయబోతున్న కేంద్రం.. ఇంతకన్నా ఏమికావాలి !!
నిధుల పంపిణీ తీరులో కూడా ఆర్థిక సంఘం కీలక మార్పులను ప్రతిపాదించింది. గతంలో ఉన్న 60-40 శాతం జాతీయ స్థాయి గ్రాంట్ నిష్పత్తిని ఇప్పుడు 80-20 శాతానికి మారుస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. గ్రామీణ జనాభా ప్రాతిపదికన 90-10 నిష్పత్తిలో నిధులు కేటాయించాలని సూచించడం వల్ల ఏపీ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రానికి మెరుగైన ప్రయోజనం చేకూరుతుంది. ఈ నిధుల్లో 50 శాతాన్ని తప్పనిసరిగా పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ Solid Waste Management మరియు తాగునీటి అవసరాలకే వినియోగించాలని నిబంధన విధించింది. మిగిలిన 50 శాతంలో రోడ్ల నిర్మాణం మరియు నిర్వహణ కోసం 20 శాతానికి మించి ఖర్చు చేయకూడదని పరిమితి విధించడం ద్వారా మౌలిక సదుపాయాల సమతుల్యతకు ప్రాధాన్యతనిచ్చింది.
Andhra Pradesh : ఏపీకి రూ.28 వేల కోట్ల నిధులు అందజేయబోతున్న కేంద్రం
స్థానిక సంస్థల నిధులతో పాటు, ప్రకృతి విపత్తుల నిర్వహణలో కూడా ఏపీకి పెద్దపీట వేసింది. దేశవ్యాప్తంగా విపత్తుల నిర్వహణ కోసం రూ. 2 లక్షల కోట్లు సిఫార్సు చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్కు రూ. 8,166 కోట్లు కేటాయించాలని సూచించింది. ఇందులో కేంద్రం వాటా రూ. 1.5 లక్షల కోట్లు కాగా, మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. తీరప్రాంత రాష్ట్రంగా తరచూ తుపాన్లు, వరదల బారిన పడే ఏపీకి ఈ నిధులు రక్షణ కవచంలా పనిచేస్తాయి. మొత్తానికి రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ నిధులు గనుక సక్రమంగా అందితే, రాష్ట్ర మౌలిక స్వరూపమే మారిపోతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.