TDP Alliance : ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇంకా అంతర్గత విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి వారు ఒకేస్టేజిపై నవ్వుతూ కనిపిస్తున్నా.. కిందిస్థాయి నేతలు, కార్యకర్తల మధ్య మాత్రం విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన కార్యకర్తలు. నేతల మధ్య ఇంకా సఖ్యత కుదరట్లేదు. దాంతో ఒక పార్టీపై ఇంకో పార్టీ వారు నిత్యం ఘర్షణలకు దిగుతూనే ఉన్నారు. ఓ వైపు వైసీపీ ప్రచారంలో దూసుకుపోతున్నా సరే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు మాత్రం ఇంకా కుమ్ములాటలు సాగిస్తూనే ఉన్నారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయితే మొదటి నుంచి టీడీపీ నేతలకు, జనసైనికులకు ఇక్కడ అస్సలు పడట్లేదు. ఇక తాజాగా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి లంకలో టీడీపీ, జనసేన కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ అధ్యక్షతన కూటమి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే జనసేన నేతలను స్టేజిపైకి పిలవలేదు. దాంతో స్టేజిపైనే తమకు స్థానం లేనప్పుడు ఇక్కడకు ఎందుకు పిలిచారంటూ జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీష్ మాధుర్ ముందే గొడవకు దిగారు ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచిబయటకు వెళ్లిపోయారు. దాంతో ఎంపీ అభ్యర్థి హరీష్మాధుర్ కలుగజేసుకొని జనసేన నేతలకు నచ్చచెప్పారు. వారిని మతిమాలి మరీ స్టేజిపైకి తీసుకొచ్చారు. ఇంకోసారి పొరపాటు జరగకుండా కమిటీలు వేస్తానంటూ ఆయన తెలిపారు. దాంతో జనసైనికులు శాంతించారు. అయితే ఇదే నియోజకవర్గంలోని చాకలిపాలెంలోను సేమ్ సీన్ రిపీట్ అయింది. అక్కడ కూడా జనసైనికులు, టీడీపీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించింది.
అక్కడ కూడా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో సమావేశం కాస్తా రసాభాసాగా మారిపోయింది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్నా వీరి మధ్య ఇంకా సఖ్యత రాలేదంటే రేపు ఫలితాలు ఎలా ఉంటాయో అని అంటున్నారు రాజకీయ నిపుణులు.
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
This website uses cookies.