ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లడం సీఎం వైఎస్ జగన్ కు అస్సలు ఇష్టం లేదనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. కాని కోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఎన్నికలకు సిద్దం అవ్వడమే బెటర్ అనే నిర్ణయానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ టీం వచ్చేశారు. ఈ సమయంలో ఎన్నికల్లో కాస్త మెజార్టీ తగ్గినా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన విజయాన్ని మరింతగా నిరూపించుకున్నట్లుగా అవుతుంది. దానికి తోడు విపక్షాల వద్ద చులకన అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో అన్న విధాల ప్రయత్నాలు చేసి ఘన విజయం సాధించడమే లక్ష్యం అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో వైఎస్ జగన్ అండ్ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేయబోతున్నారు.
ఎన్నికల కోసం సీఎం వైఎస్ జగన్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్లుగా వైకాపా నాయకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం రాయలసీమ జనాలు వచ్చేలా భారీ బహిరంగ సభను సీఎం నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రచార నగారా మ్రోగించినట్లు అవుతుందని అంటున్నారు. సాదారణంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సీఎంలు పెద్దగా పట్టించుకోరు. కాని తాము చేసిన అభివృద్ది పనులు చెప్పుకోవాలనే ఉద్దేశ్యంతో జగన్ అనంతపురం జిల్లాలో బహిరంగ సభకు సిద్దం అవుతున్నాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జగన్ అంతకు మించి ఏ ప్రచారంలో పాల్గొనబోవడం లేదని కూడా అంటున్నారు. జగన్ అనంతపురంలో రేషన్ వాహనాల పంపిణీ కోసం ఫిబ్రవరి 1న వెళ్లబోతున్నాడు. ఆ సమయంలోనే భారీ బహిరంగ సభ ఉంటుందని అంటున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన రేషన్ వాహనాల విషయలో కూడా కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ వాహనాలను ఎస్ఈసీ అనుమతిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ ఆ వాహనాల ప్రారంభంను అనుమతిస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వయంగా రేషన్ పంపిణీ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత బహిరంగ సభ ఉంటుంది. వైఎస్ జగన్ బహిరంగ సభ కోసం అనంతపురం జిల్లా వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. భూమి ఆకాశం కలిసి పోయిందా అన్న రీతిలో జనాలను సమీకరించేందుకు కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.