
YS Jaganmohan Reddy shocking Decision on volunteers in ap local body elections
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తన పంథం నెగ్గించుకున్నారు. అనుకున్నట్లుగానే వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లినా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలను నిలిపి వేయించలేక పోయాడు. రాజ్యాంగ బద్దంగా జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని ఎందుకు పదే పదే కోరుతున్నారు అంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వంను ఉద్యోగ సంఘాలను విమర్శించడంతో చేసేది లేక ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించారు. ఈ సమయంలో నిమ్మగడ్డ రమేష్ తన పవర్ అంతా కూడా ఉపయోగించి వైకాపాకు ప్రయోజనాలు చేకూరకుండా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ చాలా బలంగా ఉంది. వారు గ్రామాల నుండి పట్టణాల వరకు ఉండి ప్రభుత్వం లో భాగస్వామ్యం అయ్యి ఉన్నారు. వాలంటీర్లలో 90 శాతం వైకాపా వారే ఉన్నారనే విషయం తెల్సిందే. ఆ విషయాన్ని స్వయంగా విజయ సాయి రెడ్డి అన్నాడు.
వైఎస్ జగన్ ఆయువుపట్టు మీద కొట్టిన నిమ్మగడ్డ ?
ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పని చేస్తే ఖచ్చితంగా వైకాపాకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వారు భావిస్తున్నారు. ఆ విషయంలో వైకాపా కూడా చాలా నమ్మకంగా ఉంది. కనుక నిమ్మగడ్డ రమేష్ చాలా కీలకమైన ఏపీ వాలంటీర్ల వ్యవస్థను స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంచాలనే నిర్ణయం తీసుకుంది. సాదారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కూడా ఎన్నికల విధులు కేటాయించాల్సి ఉంటుంది. కాని వాలంటీర్లకు మాత్రం ఎన్నికల విధులు నిర్వహించవద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. వైఎస్ జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న వాలంటీర్ల వ్యవస్థను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పక్కకు పెట్టడంతో వైకాపా నాయకులు రగిలి పోతున్నారు. ఇలాంటి పనులు చేస్తాడనే నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ల వద్దని అనుకున్నాం అంటూ వైకాపా నాయకులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ తో ఈ విషయమై చర్చించాలని కూడా ఆయన భావిస్తున్నాడట. సాధ్యం అయినంత మేరకు వాలంటీర్లను ఉపయోగించుకోవాలని లేదంటే వారిని అవమానించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు. ఈ విషయంలో వాలంటీర్ల సంఘం నాయకులు కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం లో మేము భాగం అయినప్పుడు ఎందుకు మా సేవలను ఎన్నికలకు వినియోగించరు అంటూ ఆరోపిస్తున్నారు.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.