ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తన పంథం నెగ్గించుకున్నారు. అనుకున్నట్లుగానే వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లినా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలను నిలిపి వేయించలేక పోయాడు. రాజ్యాంగ బద్దంగా జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని ఎందుకు పదే పదే కోరుతున్నారు అంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వంను ఉద్యోగ సంఘాలను విమర్శించడంతో చేసేది లేక ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించారు. ఈ సమయంలో నిమ్మగడ్డ రమేష్ తన పవర్ అంతా కూడా ఉపయోగించి వైకాపాకు ప్రయోజనాలు చేకూరకుండా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ చాలా బలంగా ఉంది. వారు గ్రామాల నుండి పట్టణాల వరకు ఉండి ప్రభుత్వం లో భాగస్వామ్యం అయ్యి ఉన్నారు. వాలంటీర్లలో 90 శాతం వైకాపా వారే ఉన్నారనే విషయం తెల్సిందే. ఆ విషయాన్ని స్వయంగా విజయ సాయి రెడ్డి అన్నాడు.
ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పని చేస్తే ఖచ్చితంగా వైకాపాకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వారు భావిస్తున్నారు. ఆ విషయంలో వైకాపా కూడా చాలా నమ్మకంగా ఉంది. కనుక నిమ్మగడ్డ రమేష్ చాలా కీలకమైన ఏపీ వాలంటీర్ల వ్యవస్థను స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంచాలనే నిర్ణయం తీసుకుంది. సాదారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కూడా ఎన్నికల విధులు కేటాయించాల్సి ఉంటుంది. కాని వాలంటీర్లకు మాత్రం ఎన్నికల విధులు నిర్వహించవద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. వైఎస్ జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న వాలంటీర్ల వ్యవస్థను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పక్కకు పెట్టడంతో వైకాపా నాయకులు రగిలి పోతున్నారు. ఇలాంటి పనులు చేస్తాడనే నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ల వద్దని అనుకున్నాం అంటూ వైకాపా నాయకులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ తో ఈ విషయమై చర్చించాలని కూడా ఆయన భావిస్తున్నాడట. సాధ్యం అయినంత మేరకు వాలంటీర్లను ఉపయోగించుకోవాలని లేదంటే వారిని అవమానించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు. ఈ విషయంలో వాలంటీర్ల సంఘం నాయకులు కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం లో మేము భాగం అయినప్పుడు ఎందుకు మా సేవలను ఎన్నికలకు వినియోగించరు అంటూ ఆరోపిస్తున్నారు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.