Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు
ప్రధానాంశాలు:
Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ భూకుంభకోణం మళ్లీ చర్చకు దారి తీసింది. తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైజాగ్లో 99 పైసలకే విలువైన భూములను కొన్ని అనామక సంస్థలకు అప్పగించారని ఆయన ఆరోపించారు. లూలు గ్రూప్, లిల్లీ గ్రూప్ వంటి పేర్లతో టెండర్లు లేకుండానే సుమారు రూ.1500 కోట్ల విలువైన భూములను ఇవ్వడం అమానుషమని, ప్రజా ధనం పై దోపిడీని తాను సహించనని జగన్ స్పష్టం చేశారు.

Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు
Ys Jagan వైజాగ్ లో భూకుంభకోణం అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యంగా Ursa అనే ఎవరికీ తెలియని కంపెనీకి విశాఖపట్నంలో 3000 కోట్ల రూపాయల విలువ గల భూమిని కేవలం ఒక రూపాయికి అప్పగించారంటూ తీవ్రంగా సెటైర్లు వేశారు. “ఒక రూపాయికి ఇడ్లీ రాదేమో గాని చంద్రబాబు హయాంలో మాత్రం వేల కోట్లు విలువైన భూములు ఉచితంగా ఇచ్చేవారు” అంటూ జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం క్రమబద్ధతలేని విధానాలకు నిదర్శనమని ఆయన తెలిపారు.
అమరావతి నిర్మాణ పనుల్లో కూడా భారీ అవినీతి జరిగిందని జగన్ ఆరోపించారు. 2018లో ప్రారంభించిన రూ.36,000 కోట్ల ప్రాజెక్టు విలువను ఇప్పుడు రూ.78,000 కోట్లకు పెంచారని, ఇది పూర్తిగా రింగ్ ఫార్మేషన్ టెండర్ల ద్వారా తన వర్గీయులకే అప్పగించడమని ఆరోపించారు. పైగా మొబలైజేషన్ అడ్వాన్స్ పేరిట 10 శాతం నిధులు విడుదల చేసి, అందులో 8 శాతం కమిషన్లు తీసుకోవడం జరిగింది అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ, నిధులు ఎక్కడికి పోతున్నాయో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని జగన్ మండిపడ్డారు.
99 పైసలకే వైజాగ్ లో భూములు ఇవ్వడం పై సెటైర్లు వేసిన మాజీ సీఎం
లూలు గ్రూప్, లిల్లీ గ్రూప్ అంటూ టెండర్ లేకుండా 1500 కోట్ల విలువ గల భూములు ఇచ్చేస్తున్నాడు #ChandrababuNaidu
రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో గాని, చంద్రబాబు హయాంలో మాత్రం #Ursa లాంటి ఊరు పేరు లేని కంపెనీ కు వైజాగ్ లో… pic.twitter.com/sjoWxt2RUO
— greatandhra (@greatandhranews) April 24, 2025