Ys Jagan : వైఎస్ జగన్ పాదయాత్ర పై ఇప్పుడే అందిన బిగ్ బ్రేకింగ్..!
ప్రధానాంశాలు:
Ys Jagan : వైఎస్ జగన్ పాదయాత్ర పై ఇప్పుడే అందిన బిగ్ బ్రేకింగ్..!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ పాదయాత్రల సందడి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును మళ్ళీ గాడిలో పెట్టుకోవడానికి భారీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 2027 జూలై నెలలో వైఎస్సార్ జయంతి సందర్భంగా నిర్వహించే ప్లీనరీ తర్వాత జగన్ తన రెండో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఆయన చేసిన పాదయాత్ర కంటే ఈసారి మరింత సుదీర్ఘంగా, దాదాపు ఐదు వేల కిలోమీటర్ల మేర ప్రజల మధ్య ఉండాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నియోజకవర్గ కేంద్రాల మీదుగా సాగిన యాత్రను ఈసారి ప్రతి మండలం, మేజర్ పంచాయతీలను తాకేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పాదయాత్ర ప్రకటించినంత సులభంగా సాగుతుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది .
Ys Jagan : వైఎస్ జగన్ పాదయాత్ర పై ఇప్పుడే అందిన బిగ్ బ్రేకింగ్..!
Ys Jagan : సవాళ్లు మరియు రాజకీయ అడ్డంకులు
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జగన్ పాదయాత్రకు అనేక అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. 2017లో ఆయన పాదయాత్ర చేసినప్పటి పరిస్థితులకు, ఇప్పటికీ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జగన్ పాదయాత్రకు ఏ మేరకు అనుమతులు ఇస్తుంది, భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేసుకుంటున్న నేతలు, ఇప్పుడు జగన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందోనని చర్చించుకుంటున్నారు. నెలల తరబడి రహదారులను బ్లాక్ చేసి యాత్రలు చేస్తామంటే ప్రభుత్వం ఊరుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు జగన్ పై ఉన్న పాత కేసులు, కొత్తగా వస్తున్న ఆరోపణలు ఆయన పాదయాత్రకు ప్రధాన అవరోధాలుగా మారే ప్రమాదం ఉంది.
మరోవైపు వైసీపీ కేడర్ లో జోష్ నింపడానికి ఈ పాదయాత్ర ఒక్కటే మార్గమని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల ఓటమి తర్వాత డీలా పడిన కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకురావాలంటే జగన్ నేరుగా జనంలోకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. కానీ కేసుల చిక్కుముళ్ళు, అరెస్టుల భయం వంటి ఊహాగానాల మధ్య జగన్ తన ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు అనేది చూడాలి. ఒకవేళ ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగి యాత్రకు ఆటంకం కలిగితే అది పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన కూడా వైసీపీలో కనిపిస్తోంది. మొత్తం మీద జగన్ పాదయాత్ర ప్రకటన ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ పుట్టిస్తోంది. మరి జగన్ అనుకున్నట్లుగా తన యాత్రతో మళ్ళీ అధికారం వైపు అడుగులు వేస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.