Good News to Farmers : రైతులకు డబుల్ దమాఖా.. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహుర్తం ఫిక్స్..!
ప్రధానాంశాలు:
Good News to Farmers : రైతులకు డబుల్ దమాఖా.. పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహుర్తం ఫిక్స్..!
Good News to Farmers : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదిరిపోయే శుభవార్త అందింది. PM Kisan పీఎం కిసాన్ 22వ విడతతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ Annadata Sukhibhava నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది.
Good News to Farmers : రైతులకు డబుల్ దమాఖా.. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ముహుర్తం ఫిక్స్..!
Good News to Farmers నిధుల విడుదలపై కీలక నిర్ణయం
రైతులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ 22వ విడత మరియు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను ఒకేసారి విడుదల చేసేందుకు కసరత్తు పూర్తయింది. గతంలో 21వ విడత నిధులు నవంబర్ 19న విడుదల కాగా, తాజా సమాచారం ప్రకారం ఈ నెల 24వ తేదీన రైతులకు ఈ నగదు జమ కానుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనుండగా, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీ మేరకు పీఎం కిసాన్ నిధులతో కలిపి రైతుల ఖాతాల్లో ఈసారి రూ. 6,000 (పీఎం కిసాన్ రూ. 2,000 + అన్నదాత సుఖీభవ రూ. 4,000) ఒకేసారి జమ అయ్యే అవకాశం ఉంది.
Good News to Farmers అన్నదాత సుఖీభవ అమలు తీరు – నిధుల లెక్కలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో కేంద్రం ఇచ్చే రూ. 6,000 పోగా, మిగిలిన రూ. 14,000లను రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో పీఎం కిసాన్తో కలిపి అందిస్తోంది. ఇప్పటికే తొలి రెండు విడతల్లో రూ. 5,000 చొప్పున మొత్తం రూ. 10,000 రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు మూడో విడతగా రాష్ట్ర వాటా రూ. 4,000ను పీఎం కిసాన్ నిధులతో కలిపి విడుదల చేయనున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులు ఏటా మూడు సమయాల్లో భారీ మొత్తంలో ఆర్థిక ఊరట పొందనున్నారు. అధికారులు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, సాంకేతిక ప్రక్రియను వేగవంతం చేశారు.
Good News to Farmers : ఈ-కేవైసీ తప్పనిసరి
నిధులు సజావుగా ఖాతాల్లో పడాలంటే రైతులు ఖచ్చితంగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది. గతంలో పలుమార్లు సూచించినా ఇంకా కొంతమంది రైతులు ఈ ప్రక్రియను పెండింగ్లో ఉంచారు. ఈసారి ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే నిధులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు. రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లలో (CSC) బయోమెట్రిక్ ద్వారా గానీ, పీఎం కిసాన్ పోర్టల్లో ఆధార్ ఓటీపీ ద్వారా గానీ, లేదా పీఎం కిసాన్ యాప్లో ఫేస్ రికగ్నిషన్ ద్వారా గానీ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే పీఎం కిసాన్ వెబ్సైట్లోని ‘Know your status’ ద్వారా తమ రిజిస్ట్రేషన్ స్థితిని కూడా సరిచూసుకోవాలని సూచించారు.