Pawan kalyan : ఏపీలో కూటమి గెలిస్తే పక్కా పవన్ సీఎం

Pawan kalyan : ఆంధ్ర రాష్ట్రంలో పొత్తు కుదుర్చుకున్న జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు సంయుక్తంగా ఇటీవల చిలకలూరిపేటలో ప్రజాగలం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందేే. ఇక ఈ ప్రజా గళం సభకు మూడు పార్టీల ముఖ్య నేతలు చంద్రబాబు నాయుడు , నరేంద్ర మోడీ , పవన్ కళ్యాణ్ హాజరవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. అయితే నరేంద్ర మోడీ ప్రజాగలం సభలో మాట్లాడుతూ….అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో మరియు రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ కచ్చితంగా ఉండాలి అని మోడీ పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిందిగా నరేంద్ర మోడీ పిలుపునివ్వడం జరిగింది. అయితే నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడడం అంత బాగానే ఉంది కానీ ప్రసంగంలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కానీ చంద్రబాబును ఉద్దేశించి కానీ నరేంద్ర మోడీ మాట్లాడలేదు. దీంతో రాష్ట్ర రాజకీయ నేతలను ప్రశంసిస్తూ మాట్లాడకపోవడంతో ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే నరేంద్ర మోడీ ప్రసంగంలో మాట్లాడుతూ టీడీపిఐ జనసేన బీజేపీ పార్టీకి ఓటు వేయాలి అని చెప్పకుండా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాల్సిందిగా కోరడం జరిగింది.

అయితే కేంద్రంలో ఎన్డీఏ కూటమికి నాయకత్వ స్థానంలో ఉంది బీజేపీ పార్టీ కావడం ఇక్కడ గమనార్హం. అయితే మూడు పార్టీల కూటమి ద్వారా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని ఆశించాలని అనుకున్న చంద్రబాబుకు నరేంద్ర మోడీ గట్టి షాక్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. అయితే ఈ ప్రసంగంలో నరేంద్ర మోడీ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎన్డీఏకి రాకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్లడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని మోడీ ఆరోపించారు. ఈ విధంగా ప్రసంగం మొత్తంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి గెలిపించాలని చెప్పారు తప్ప రాష్ట్ర అధినేతల గురించి మాత్రం చెప్పలేకపోయారు. ఎన్డీఏని కచ్చితంగా గెలిపించాలని చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడుని మరోసారి ముఖ్యమంత్రి చేయండి అని లేదా పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వండి అని చెప్పలేకపోయారు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వంటి అనుభవశాలి ముఖ్యమంత్రి అవసరమని ఒక మాట నరేంద్ర మోడీ చెప్పి ఉంటే కచ్చితంగా జనాలలో అది పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేదని పలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అవుతారు అనేది మాత్రం తెలియడం లేదు.

ఇక నరేంద్ర మోడీ కేంద్రంలో మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే డబ్బల్ ఇంజన్ సర్కార్ అవుతుందని అప్పుడు అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రస్తుతం నరేంద్ర మోడీ మనసులో ఎవరు సీఎం అభ్యర్థిగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ స్థానంలో మిత్రపక్షం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తుంది. ఇక దానిలో 88 సాధించటం అనేది కాస్త కష్టమే. దీంతో జనసేనకి బీజేపీ ఎంత తక్కువ సీట్లు వచ్చినా సరే వారికి ప్రముఖ స్థానం ఇచ్చేందుకు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా పలువురు పలు రకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ చిలకలూరిపేటలో బాబు గురించి ప్రస్తావించకుండా ప్రసంగం ముగించారని టాప్ నడుస్తుంది. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Recent Posts

Naga Chaitanya Sobhita Dhulipala : మీడియాకి గుడ్ న్యూస్ చెప్పిన శోభిత‌.. పెళ్లై ఆరు నెల‌లు కాక‌ముందే ప్ర‌గ్నెంటా..?

Naga Chaitanya Sobhita Dhulipala : స‌మంత నుండి విడిపోయిన తర్వాత నాగ చైత‌న్య.. శోభితని వివాహం చేసుకున్న విష‌యం…

5 hours ago

Chanakyaniti : ఆ విషయంలో అస్సలు సిగ్గు పడొద్దు… ఒకవేళ పడితే తప్పదు భారీ నష్టం, మీ ఊహకే వదిలేస్తున్నా… అంటున్న చాణిక్య…?

Chanakyaniti : సాధార్నంగా కొన్ని విషయాలలో మహిళలే ఎక్కువగా సిగ్గు పడుతుంటారు. కానీ చాణిక్య నీతిలో చాణిక్యుడు స్త్రీలే కాదు,పురుషులు…

6 hours ago

Pan India Star : పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు..ఇప్పుడు గేట్ ముందు వాచ్ మెన్ గా మారాడు

Pan India Star  : సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కడం ఒక అదృష్టం. అవకాశాన్ని అందిపుచ్చుకున్న తర్వాత సక్సెస్ ఉన్నంతకాలం…

7 hours ago

Asaduddin Owaisi : పాకిస్తాన్ నేతలను ISIS ఉగ్రవాదులతో పోల్చిన అసదుద్దీన్

Asaduddin Owaisi : ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ కంటే పాకిస్తాన్…

8 hours ago

CM Revanth Reddy : కేసీఆర్ స్పీచ్ పై రేవంత్ మాములు సెటైర్లు వెయ్యలేదుగా..!!

CM Revanth Reddy : తెలంగాణ Telangna CM ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ సందర్భంగా తెలంగాణ…

9 hours ago

Horse Gram : మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే… వీటిని తింటే చాలు ఆరోగ్యం రేసుగుర్రమేనట…?

Horse Gram : నిత్యం ఆరోగ్యంగా Health ఉండాలని ఎవరు కోరుకోరు. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరిక. కానీ ప్రస్తుత…

11 hours ago

Shahid Afridi : రక్తం మ‌రిగే వ్యాఖ్యలు చేసిన షాహిద్ ఆఫ్రిది.. భార‌తీయులు ఆగ్ర‌హం..!

Shahid Afridi : పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది అమాయక భారతీయుల మర‌ణాన్ని ఇంకా ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.…

12 hours ago