Kesineni Nani : వైజాగ్ ను అమ్మకానికి పెట్టేశారంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kesineni Nani : వైజాగ్ ను అమ్మకానికి పెట్టేశారంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

 Authored By ramu | The Telugu News | Updated on :24 April 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Kesineni Nani : వైజాగ్ ను అమ్మకానికి పెట్టేశారంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Kesineni Nani : విజయవాడ Vijayawada మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొని రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన ఆయన, తాజాగా తన సోదరుడిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన స్థానంలో విజయం సాధించిన సోదరుడు చిన్ని పై నాని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో ఉర్సా క్లస్టర్స్ అనే స్టార్టప్ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం 3 వేల కోట్ల విలువైన భూముల కేటాయింపు అంశాన్ని ఎత్తి చూపుతూ ప్రశ్నలు సంధించారు.

Kesineni Nani వైజాగ్ ను అమ్మకానికి పెట్టేశారంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Kesineni Nani : వైజాగ్ ను అమ్మకానికి పెట్టేశారంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Kesineni Nani : చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన టీడీపీ మాజీ నేత

ఈ డీల్ వెనుక కేశినేని చిన్ని ప్రమేయం ఉందని నాని ఆరోపించారు. సంస్థలోని ఒక ప్రమోటర్ తన సోదరుడి క్లాస్‌మేట్ అని పేర్కొంటూ, వారి మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా భూములు కేటాయించారని సందేహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా వైజాగ్ ఈజ్ ఫర్ సేల్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ భూముల్ని దక్కించుకున్న ఉర్సా క్లస్టర్‌కు చెందిన ప్రమోటర్లు జూమ్ కాల్‌లో మాట్లాడి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము ఏపీ ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమి విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. తాము ఎకరా భూమిని 99 పైసలకు తీసుకోలేదని తెలిపారు. ఆ భూమిని మార్కెట్ ధరలకే తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తమది కొత్తగా రిజిస్ట్రర్ అయిన కంపెనీ అయినా.. తమ టీమ్‌లో అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని చెప్పుకొచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది