
Nagababu : నాగబాబుకి మళ్లీ బ్రేక్ వేశారా.. రాజ్యసభకు ఆ ముగ్గురు వెళ్లనున్నారా..!
Nagababu : ఆంద్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడం మనం చూశాం. ఏపీతోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్ హర్యానాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇవన్నీ ఉపఎన్నికలే. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు కూడా వైసీపీ నుంచి విజయం సాధించిన రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో తిరిగి ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇలా మూడు స్థానాలకు గాను తెలుగుదేశం జనసేన బాజాపామూడు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురిని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య లకి రాజ్యసభ పదవులకు పోటీ చేసే అవకాశాలు లేనట్లే. ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ సీట్లలో కూటమి పార్టీల్లో ఒకటి అయిన జనసేనకు ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చు.
Nagababu : నాగబాబుకి మళ్లీ బ్రేక్ వేశారా.. రాజ్యసభకు ఆ ముగ్గురు వెళ్లనున్నారా..!
జనసేన పార్టీ తరపున నాగబాబును ఎంపీగా పంపిస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో త్యాగం చేశారు. పొత్తుల్లో సీట్లు త్యాగం చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్నందున నాగబాబుకు ఎంపీ సీటు కాయమని జనసేన వర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే కొన్ని సమీకరణాలు మారుతున్నాయి.ప్రస్తుతం భర్తీ చేయాల్సిన మూడు స్థానాల్లో బీదా మస్తాన రావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయటం ఖాయమైంది. ఆ హామీతోనే మస్తాన రావు వైసీపీకి రాజీనామా చేసారు.
మూడు స్థానాల్లో బీసీలకు ఇవ్వకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో, బీదాకు ఖాయమని చెబుతున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయదేవ్ అభ్యర్దిత్వం పైన పవన్ సైతం అంగీకారం తెలిపారని సమాచారం. ఇదే స్థానాన్ని కంభంపాటి రామ్మోహన్ సైతం ఆశిస్తున్నారు. అదే విధంగా సానా సతీశ్ పేరు ప్రముఖంగా రేసులోకి వచ్చింది. అటు టీడీపీ, జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీశ్ కు మద్దతు లభిస్తోంది. ఎన్నికలు జరుగుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు పూర్తి కాలం పదవి లేదు. ఒక రాజ్యసభ పదవికి కేవలం రెండేళ్లే చాన్స్ ఉంది . ఒక సభ్యుడి పదవి 2026, మరో ఇద్దరి పదవులు 2028కి పూర్తవుతాయి. అయితే ఇప్పుడు ఎన్నికయ్యే వారికి ద్వైవార్షిక ఎన్నికల సమయంలో టీడీపీ హైకమాండ్ మరో అవకాశం ఇచ్చే చాన్స్ ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఎంపీలు అయ్యేవారు తరవాత కూడా మరో చాన్స్ దక్కించుకుంటారని పోటీ ఎక్కువగా ఉంది.
Karthika Deepam 2 March 20 Episode : స్టార్ మా Star Maa ఛానెల్లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం…
Raw Vs Ripe Papaya : ప్రకృతి మనకు అందించిన పోషక సంపదలో బొప్పాయి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సాధారణంగా…
Coconut Water Vs Lemon Water : ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. బయట అడుగు పెట్టిన క్షణం నుంచి శరీరం…
Beetroot Juice : బీట్రూట్ను పోషకాల గనిగా పరిగణిస్తారు. ఇందులో ఫోలేట్, పొటాషియం, విటమిన్-సి వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా…
Khammam : ఖమ్మం జిల్లా ప్రజల దశాబ్దాల ఆశలు నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. జిల్లాలో రవాణా సౌకర్యాలను…
Nalgonda : నల్లగొండ జిల్లా గడియారం సెంటర్లో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా కమిటీ మరియు…
Iran Israel Trump : ఇరాన్ మీద అమెరికా అలాగే ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా…
Rythu Bharosa : ఆమనగల్ మండలంలోని రైతులకు వ్యవసాయ శాఖ నుంచి ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఇటీవల కొత్తగా పట్టాదారు…
Ustaad Bhagat Singh vs Dhurandhar 2 : భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన…
R.V Foundation : వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే గులాబీ బాస్ కేసీఆర్ను కోలుకోలేని…
LPG Cylinders : వంటగ్యాస్ సిలిండర్ కోసం వేచి చూసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది.…
This website uses cookies.