One Nation One Election : టీడీపీ విప్ జారీ.. రెండేళ్ల‌లోనే ఏపీలో ఎన్నిక‌లా..?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 17 December 2024, 9:00 pm
  •  One Nation One Election : టీడీపీ విప్ జారీ.. రెండేళ్ల‌లోనే ఏపీలో ఎన్నిక‌లా..?

One Nation One Election : పార్లమెంటులో కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 129వ రాజ్యంగ సవరణ బిల్లుతో సహా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దీన్ని ఉభయసభల సంయుక్త కమిటీకి పంపించాలని కేంద్రం సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ మంగళవారం ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయలు నెలకొన్న వేళ.. విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను కేంద్రమంత్రి కోరనున్నారు.

One Nation One Election : టీడీపీ విప్ జారీ.. రెండేళ్ల‌లోనే ఏపీలో ఎన్నిక‌లా..?

One Nation One Election : టీడీపీ విప్ జారీ.. రెండేళ్ల‌లోనే ఏపీలో ఎన్నిక‌లా..?

One Nation One Election అంతా స‌స్పెన్స్..

ఎజెండాను లోక్‌సభలో వెల్లడించిన తర్వాత ఈ బిల్లుపై ఏకాభిప్రాయం తీసుకోనున్నారు. ఈ బిల్లును జేపీసీకి సమర్పించడం, వివరణాత్మక చర్చ, ఏకాభిప్రాయం కోసం పంపబడుతుంది. రేపు జేపీసీ ఏర్పాటు చేస్తామని, అందులో బీజేపీ-కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల సభ్యుల పేర్లను కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ బిల్లును ఇంకా ఎజెండాలో చేర్చలేదు. కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా విప్‌ను జారీ చేయాలంటూ బీజేపీ ఆదేశించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ, శివసేన మూడంచెల విప్‌ను ఇచ్చాయి.

జమిలి ఎన్నికలతో పాటు గవర్నమెంట్ యూనియన్ టెరిటరీ యాక్ట్ 1963, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 సభ ముందుకు వస్తాయి. కాగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 12న కేంద్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని పక్కనబెట్టి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులను ఆమోదించింది. నేటి సభా కార్యకలాపాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందంటూ తమ ఎంపీలకు సూచించింది బీజేపి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  2. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

  3. "Fennel Water : డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు వరమా?.. రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  4. "Tirumala : తిరుమలలో రూమ్ దొరకలేదా? అయితే నిరాశ చెందొద్దు.. టీటీడీ ఉచితంగా అందిస్తున్న ఈ సదుపాయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!"

  5. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  6. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  7. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp