Ys jagan : ఎవరెన్ని చెప్పిన కానీ ఆంధ్ర రాజకీయాల్లో కులం ఎప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తునే ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశము చేసిన నాటి నుండి కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్లు మారిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ పోషించిన పాత్రను ఇప్పుడు వైస్సార్సీపీ పోషిస్తుంది అంతే తేడా.. టీడీపీ అంటే కమ్మ , వైస్సార్సీపీ అంటే రెడ్డి అన్నట్లు మారిపోయింది. ఇక జనసేన ఏమో కాపు నేతల పార్టీ,బీజేపీ ఏమో మతపరమైన పార్టీగా ముద్ర వేసుకొని రాజకీయాలు చేస్తున్నాయి.
రెడ్ల పార్టీగా ముద్ర పడిన వైసీపీలో జగన్ మోహన్ రెడ్డిని అమితంగా అభిమానించే వ్యక్తులు ఎవరయ్యా అంటే ఇద్దరు కమ్మ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు మంత్రి కొడాలి నాని, మరొకరు సినీ రచయిత, నటులు పోసాని కృష్ణమురళి. ఈ ఇద్దరు కూడా జగన్ మీద ఎలాంటి ఆరోపణలు వచ్చిన మొదటిగా స్పందించే వ్యక్తులు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుండి ఎవరైనా జగన్ మీద విమర్శలు చేస్తే, ఖచ్చితంగా ఈ ఇద్దరు ఎదురుదాడి చేయటం మనం చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో రెడ్లు, కమ్మ నేతల మధ్య సంబంధాలు ఉప్పునిప్పులా ఉన్నాయి. అలాంటిది జగన్తో కొడాలి నాని, పోసాని కృష్ణమురళీకి పెనవేసుకున్న ఆత్మీయానురాగాల బంధం సామాన్యమైంది కాదు. ఒకసారి అసెంబ్లీ లో జగన్ మాట్లాడుతూ తన కేబినెట్లో తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి వ్యక్తుల్లో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లే నాని కూడా ఎప్పుడు జగన్ కు విధేయుడిగా ఉంటూ ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు.
ఇక పోసాని కృష్ణమురళి నైజం గురించి అందరికి తెలిసిందే, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం ఆయన సొంతం. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, కేవలం జగన్ మాటపై నిలబడే నిజాయితీనే తనను ఆయనకు దగ్గర చేసిందని ఆ సినీ ప్రముఖుడు అనేక సందర్భాల్లో చెప్పారు.తాను కూడా కమ్మవాడినే అని, జగన్ ఎప్పుడూ కుల దృష్టితో చూడరని పోసాని చెప్పడం తెలిసిందే. పెద్దగా మీడియా ముందుకు రాని పోసాని, సరిగ్గా ఎన్నికల సమయానికి ముందు ప్రెస్ మీట్ లు పెట్టి టీడీపీ కి చాకిరేవు పెట్టటం మనం గమనించవచ్చు. మున్సిపల్ ఎన్నికల జరగబోతున్నా ఈ టైం లో నిన్న పోసాని మాట్లాడిన మాటలు టీడీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
వైసీపీ తరుపున ఎవరెన్ని మాట్లాడిన కానీ, కొడాలి నాని, పోసాని కృష్ణమురళి చేసే కామెంట్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎదో మూవీలో చెప్పినట్లు ఆ కిక్కే వేరబ్బా అన్నట్లు ఉంటాయి. ఇదే సమయంలో భూతుల మంత్రిగా ప్రత్యర్థులు కొడాలి నానిపై ఎన్ని విమర్శలు చేసినా …ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అదే విధంగా పోసాని కూడా ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు.. ఈ ఇద్దరు జగన్ కు ఒక కవచంగా మారిపోయారనే చెప్పాలి.. అదే సమయంలో బాబుకు శాపంగా మారిపోయారని కూడా చెప్పాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.