Pothuluri Veera Brahmam Garu : తిరుమల వరదల గురించి బ్రహ్మం గారు చెప్పిందే నిజం అయిందా? ఇంకా ఆయన ఏం చెప్పారు?
Pothuluri Veera Brahmam Garu : పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలుసు కదా. కలియుగంలో ఏం జరుగుతుందో.. ఎటువంటి వినాశకాలు ఏర్పడుతాయో.. ముందే ఊహించి ఆయన చెప్పారు. ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన చెప్పినవి చాలా జరిగగాయి. బ్రహ్మం గారి కాల జ్ఞానం పేరుతో వచ్చిన పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. అందులోనే ఆయన ఏం ఏం జరగబోతున్నాయో చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించి ఆ పుస్తకంలో ఆయన పొందుపరిచారు. […]
Pothuluri Veera Brahmam Garu : పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలుసు కదా. కలియుగంలో ఏం జరుగుతుందో.. ఎటువంటి వినాశకాలు ఏర్పడుతాయో.. ముందే ఊహించి ఆయన చెప్పారు. ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన చెప్పినవి చాలా జరిగగాయి. బ్రహ్మం గారి కాల జ్ఞానం పేరుతో వచ్చిన పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది. అందులోనే ఆయన ఏం ఏం జరగబోతున్నాయో చెప్పుకొచ్చారు.
భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించి ఆ పుస్తకంలో ఆయన పొందుపరిచారు. 17 వ శతాబ్దంలో ఆయన తత్వాలను బోధించారు. భవిష్యత్తులో జరగబోయే విపత్తుల గురించి అప్పట్లో ఊహించినా.. అందరూ ఆయన మాటను నమ్మలేదు. కానీ.. ఒక్కొక్కటిగా జరగడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆయన చెప్పిన దాంట్లో తిరుమల కూడా ఉంది.
Pothuluri Veera Brahmam Garu : తిరుమలకు గురించి ఆయన ఏం చెప్పారంటే?
తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి.. అన్నారు. ఆయన తన కాల జ్ఞానంలో తిరుమల గురించి ప్రత్యేకంగా బ్రహ్మం గారు ప్రస్తావించారు. తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయని అప్పుడే చెప్పారు. చెప్పినట్టుగానే.. తిరుమల పరిసరాలన్నీ భారీ వరదలకు మూసుకుపోయాయి. ఇప్పుడు తిరుమలకు వెళ్లే పరిస్థితి లేదు. తిరుమల దర్శనానికి కూడా భక్తులు ఎక్కువగా వెళ్లడం లేదు. రాయలసీమను భారీ వర్షాలు ఇంకా ముంచెత్తుతున్నాయి.
తిరుపతి మొత్తం జలమయం అయింది. తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. నవంబర్ 17 నుంచి కురిసిన వర్షాలకు తిరుపతి, తిరుమల అల్లకల్లోలం అయ్యాయి. ఇలాంటి విపత్తు తిరుపతిలో సంభవిస్తుందని ముందే ఊహించారు బ్రహ్మం గారు.