Purnanada Swamiji Arrest
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖపట్నం నగరంపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులను సైతం కిడ్నాప్ కి గురికావడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నంలో జ్ఞానానంద ఆశ్రమంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆశ్రమంలో స్వామీజీ 15 సంవత్సరాల బాలికపై అత్యంత పైశాచికంగా కర్కసంగా అత్యాచారానికి పాల్పడటం జరిగింది. ఒక ఏడాది నుంచి బాలికను తన గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించేవాడట. ఆమె ఎదురు తిరిగితే కొట్టేవాడట.
ఆ బాలికకు ఆకలేస్తే రెండు చెంచాల అన్నాన్ని నీటితో కలిపి మాత్రమే పెట్టేవాడట. రెండు వారాలకు ఓసారి మాత్రమే స్నానానికి వెళ్లనిచ్చేవాడట. రాజమహేంద్రవరానికి చెందిన ఆ పదిహేను సంవత్సరాల బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో ఆమెను బంధువులు ఐదో తరగతి దాకా చదివించి రెండేళ్ల కిందట జ్ఞానానంద ఆశ్రమంలో సేవలు కోసం పంపించారు. అయితే ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ ఆ బాలికతో ఆవులకు మేత వేయించటం, తేడా తీయటం లాంటి పనులు చేయించేవాడు. అర్ధరాత్రి పూట బాలికను తనతో పాటు రూమ్ కు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఏడాది నుంచి బాలిక కాల గొలుసువేసి బంధించి కాలకృత్యాలకు కూడా అనుమతించేవాడు కాదట. ఈ రకంగా రెండేళ్లుగా బాలికను చిత్రహింసలకు గురి చేసేవాడట. ఈ నెల 13వ తేదీన పనిమనిషి సాయంతో బాధితురాలు ఆశ్రమం నుంచి బయటపడింది.
Purnanada Swamiji Arrest
స్వామీజీ తనను చిత్రహింసలకు గురి చేసిన విషయాన్ని కంకిపాడు పోలీసుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో బాలికను విజయవాడలోని దిశా పోలీస్ స్టేషన్ కు పంపారు. పూర్ణానంద స్వామీజీ పై ఫోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత విశాఖ పోలీసులు స్వామీజీని అరెస్టు చేయడం జరిగింది.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.