Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు
Roja : ఆంధ్రప్రదేశ్లో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తాజాగా రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. సాక్షి టీవీకి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపుతున్నాయి. అమరావతి మహిళలు ఆగ్రహంతో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ను తీవ్రంగా ఆడిపోసారు. అధికారంలోకి రాకముందు మహిళల విషయంలో పోరాటం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు పాలనలో భాగస్వామిగా ఉన్నప్పటికీ మౌనంగా ఉన్నారని ఆమె విమర్శించారు.
Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో..!
మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై స్పందించకపోవడం పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని చూపిస్తోందన్నారు. ఒక చిన్నారి పై జరిగిన అత్యాచారాన్ని నిష్పక్షపాతంగా విచారించాల్సిన చోటా, అధికార యంత్రాంగం దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం దారుణమని రోజా అభిప్రాయపడ్డారు. అనంతపురంలో గిరిజన విద్యార్థిని ఆరురోజులు కనిపించకపోయినా, పోలీసుల నిర్లక్ష్యం వల్ల శవమై కనిపించిందని ఉదహరించారు. ఇటువంటి ఘటనలపై కూటమి సర్కారు నేతలు నిశ్శబ్దంగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు.
మహిళలకు న్యాయం చేయాలని చెప్పే నాయకులు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అసలు సమస్యల్ని దాచిపెడుతున్నారని రోజా తీవ్రంగా విమర్శించారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నా మహిళలకు రక్షణ లేకపోతే అది దుర్మార్గం కాదా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజల శ్రద్ధను మళ్లించేందుకు ఇతర విషయాలపై దృష్టి పెట్టడం కూటమి తీరుని నిందించారు. మరి రోజా ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం చెపుతారో..కూటమి సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.