KCR – YS Jagan : పాపం.. వారిద్ద‌రిని న‌మ్మినోళ్లే న‌ట్టేట ముంచుతున్నారుగా.. ప‌రిస్థితి దారుణం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR – YS Jagan : పాపం.. వారిద్ద‌రిని న‌మ్మినోళ్లే న‌ట్టేట ముంచుతున్నారుగా.. ప‌రిస్థితి దారుణం..!

KCR – YS Jagan : ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప‌రిస్థితి దారుణంగా మారింది. ఒక‌ప్పుడు మాకు ఎదురే లేద‌నుకున్న బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలకి ఇప్పుడు జ‌నాల‌లో విచిత్ర ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి కీలక నేతలు అనుకున్న వారు ఎందరో పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరిపోవడం వంటివి సర్వసాధారణం అయిపోయాయి. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే వరుసగా రెండు సార్లు తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, మూడోసారి […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 August 2024,4:00 pm

KCR – YS Jagan : ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప‌రిస్థితి దారుణంగా మారింది. ఒక‌ప్పుడు మాకు ఎదురే లేద‌నుకున్న బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలకి ఇప్పుడు జ‌నాల‌లో విచిత్ర ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి కీలక నేతలు అనుకున్న వారు ఎందరో పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరిపోవడం వంటివి సర్వసాధారణం అయిపోయాయి. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే వరుసగా రెండు సార్లు తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, మూడోసారి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలవ్వడం తో అప్పటి నుంచి వరుసగా కష్టాలు మొదలయ్యాయి. వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడంతో జనాల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ ను ఓటమిపాలు చేసింది.

KCR – YS Jagan : ఒకే సిట్యుయేష‌న్..

కాకపోతే అంత ఘోరంగా అయితే ఓటమి చెందలేదు. బీఆర్ఎస్ ఓటమి చెందిన వెంటనే కేసీఆర్ కి అత్యంత నమ్మకస్తులుగా పేరుపొందిన వారే ముందుగా పార్టీని వీడి వెళ్ళారు. పట్నం మహేందర్ రెడ్డి , దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది కీలక నాయకులే పార్టీని వీడి కేసీఆర్ నమ్మకం పై దెబ్బకొట్టారు.ఇంకా ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇక వైసీపీ విషయానికి వస్తే, బీఆర్ఎస్ మాదిరిగానే వైసీపీ కూడా ఏపీలో కూడా విచిత్ర ప‌రిస్థితులు ఎదుర్కొన్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలో కి వచ్చి 5 ఏళ్ల పాటు తన పాలన ను జనాలకు చూపించిన వైసీపీ త‌ర్వాత బొక్క‌బోర్లా ప‌డింది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇక అప్పటి నుంచి ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.

jagan and kcr

జ‌గన్ బంధువులు, అత్యంత సన్నిహితులు గా గుర్తింపు పొందిన వారు మొదటి నుంచి జగన్ వెంట నడిచిన ఎంతో మంది వైసీపీని వీడి వెళ్లిపోయారు. మాజీ మంత్రి ఆళ్ళ నాని వంటి వారు పార్టీకి రాజీనామా చేయడం జగన్ కు పెద్ద షాకే ఇచ్చింది. ప్రస్తుతం వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వంటి వారు వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. వారితో పాటు ప‌లువురు పార్టీనీ వీడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. చూస్తుంటే జ‌గ‌న్ పార్టీ ప‌రిస్థితి కొద్ది రోజుల‌లో మ‌రింత అధ్వాన్నంగా మార‌నుంద‌ని అంటున్నారు

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది