Sankranti Festival : సంక్రాంతి పేరిట ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రయాణికుల నిలువు దోపిడీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 January 2026,4:00 pm
  •  సంక్రాంతి పండుగ రద్దీ.. ప్రయాణికుల నిలువు దోపిడీ : ప్రైవేట్‌ బస్సులపై రవాణాశాఖ చర్యలు

Sankranti Festival : సంక్రాంతి పండుగ ( Sankranti festival ) సెలవుల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి గ్రామాల బాట పట్టిన ప్రజలతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి(Hyderabad-Vijayawada National Highway  కిటకిటలాడుతోంది. ముఖ్యంగా నగరాన్ని విడిచిపోతున్న వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో పంతంగి టోల్‌ ప్లాజా వద్ద తీవ్ర ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్లు, బస్సులు, లారీలు భారీగా చేరడంతో రహదారి పూర్తిగా నిండిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేందుకు భువనగిరి, రామన్నపేట మార్గంగా చిట్యాలకు చేరుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణిస్తే సమయం ఆదా అవుతుందని, ప్రయాణం సాఫీగా సాగుతుందని పోలీసులు చెబుతున్నారు. పండుగ రోజుల్లో మరింత రద్దీ ఏర్పడే అవకాశముందని అధికారులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు.

Sankranti Festival : సంక్రాంతి పేరిట ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రయాణికుల నిలువు దోపిడీ..!

Sankranti Festival : సంక్రాంతి పేరిట ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రయాణికుల నిలువు దోపిడీ..!

సంక్రాంతి రద్దీ.. ప్రైవేట్‌ బస్సులపై రవాణాశాఖ చర్యలు

అటు పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థలు విపరీతంగా ఛార్జీలు పెంచినట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే ధరలతో పోలిస్తే రెట్టింపు, కొన్ని సందర్భాల్లో విమాన టికెట్‌ ధరలతో సమానంగా బస్సు ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల మధ్యతరగతి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. ఆర్టీసీ ఛార్జీల కంటే 50 శాతం మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ట్రావెల్స్‌ యజమానులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు, బస్సుల సీజ్‌ వంటి చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

సంక్రాంతి పేరిట ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అధిక ఛార్జీలు.. రవాణాశాఖ చర్యలు

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు రవాణాశాఖ ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ నెల 18వ తేదీ వరకు ట్రావెల్స్‌ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌పై ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 92816 07001ను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేస్తే సంబంధిత ట్రావెల్స్‌పై వెంటనే చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను సీజ్‌ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పండుగ ప్రయాణాలు సురక్షితంగా, న్యాయమైన ధరలతో సాగేందుకు అందరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement

ramu

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి