
Tirumala Laddu : శ్రీవారి లడ్డూ విషయంలో కుట్ర జరిగింది.. చంద్రబాబుపై సుబ్రహ్మణ్య స్వామి కొత్త అనుమానాలు
Tirumala Laddu : వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపాలంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాఫ్తు చేయాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు. కల్తీ నెయ్యి అంశంలో ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేశారని సుబ్రమణ్యస్వామి అన్నారు. అటు వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంలో విచారణ కోరుతూ పిటిషన్ వేశారాయన. రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో ఎంక్వైరీ జరపాలని కోరారు. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు కుట్ర కోణానికి సంబంధించి జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త తరహా కుట్ర కోణానికి తెర తీశారని సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. ఇంతకూ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. – ఆవునెయ్యి శాంపిల్స్ పరీక్షలుచేసి.. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవటంతో వెనక్కు పంపించినట్లు టీటీడీ ఈవో రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. కల్తీ జరిగిందని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు పదే పదే బహిరంగంగా ప్రకటించటం దేనికి నిదర్శనం?ఇలా ఆరోపణలు చేసిన తర్వాత దర్యాప్తునకు ఆదేశిస్తారా? నిజానిజాలను నిర్దారించుకోకుండా భక్తుల్లో అలజడి క్రియేట్ చేయడం ఎంత వరకు కరెక్ట్.. లడ్డూ విషయంలో కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోకుండా ఎలా ఆరోపణలు చేస్తారు.
Tirumala Laddu : శ్రీవారి లడ్డూ విషయంలో కుట్ర జరిగింది.. చంద్రబాబుపై సుబ్రహ్మణ్య స్వామి కొత్త అనుమానాలు
కల్తీపై దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ నియమించటం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుకోవటం లేదు. జులైలో కల్తీ జరిగిందని చెప్పి.. ఇంతకాలం ఎందుకు సిట్ ను నియమించారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తిరుపతిలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఒక ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చారు. తద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మత ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. 2019లో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు.ఒక క్రైస్తవుడిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా నియమిస్తారని హిందూవాదులు అగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు పత్రికల్లో పతాక స్థాయిల్లో స్టేట్ మెంట్లు ఇచ్చారు. కల్తీ జరిగిందని కానీ.. చేపనెయ్యి.. కొవ్వు కలిసినట్లుగా ఎక్కడా లేదు. ఒకరి గుర్తింపును.. ఎదుగుదలను రాజకీయంగా నాశనం చేసేందుకు తప్పుడు వార్తలను ప్రచారం చేసి ఏజెన్సీలు సైతం ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సుబ్రమణ్య స్వామి హెచ్చరించారు.
Gold Silver Rates April 9th 2026 : పసిడి ప్రియులకు, ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది…
Karthika Deepam 2 April 9th 2026 Episode | స్టార్ మా లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2'…
Dry fruits : సాధారణంగా డ్రైఫ్రూట్స్ అంటే మనకు ఆరోగ్యానికి మేలు చేసే తిండి అనే భావన వెంటనే గుర్తుకు…
Kiwi Fruit : నేటి వేగవంతమైన జీవనశైలి, అసమతుల ఆహారపు అలవాట్లు కారణంగా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు…
Tea : ఉదయాన్నే నిద్రలేవగానే వేడివేడి టీ కప్పుతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటు మాత్రమే కాదు, ఒక…
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్ను విస్తరించింది. తాజాగా ‘రియల్మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…
This website uses cookies.