
Tirumala Laddu : శ్రీవారి లడ్డూ విషయంలో కుట్ర జరిగింది.. చంద్రబాబుపై సుబ్రహ్మణ్య స్వామి కొత్త అనుమానాలు
Tirumala Laddu : వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపాలంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాఫ్తు చేయాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు. కల్తీ నెయ్యి అంశంలో ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేశారని సుబ్రమణ్యస్వామి అన్నారు. అటు వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంలో విచారణ కోరుతూ పిటిషన్ వేశారాయన. రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో ఎంక్వైరీ జరపాలని కోరారు. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు కుట్ర కోణానికి సంబంధించి జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త తరహా కుట్ర కోణానికి తెర తీశారని సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. ఇంతకూ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. – ఆవునెయ్యి శాంపిల్స్ పరీక్షలుచేసి.. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవటంతో వెనక్కు పంపించినట్లు టీటీడీ ఈవో రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. కల్తీ జరిగిందని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు పదే పదే బహిరంగంగా ప్రకటించటం దేనికి నిదర్శనం?ఇలా ఆరోపణలు చేసిన తర్వాత దర్యాప్తునకు ఆదేశిస్తారా? నిజానిజాలను నిర్దారించుకోకుండా భక్తుల్లో అలజడి క్రియేట్ చేయడం ఎంత వరకు కరెక్ట్.. లడ్డూ విషయంలో కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోకుండా ఎలా ఆరోపణలు చేస్తారు.
Tirumala Laddu : శ్రీవారి లడ్డూ విషయంలో కుట్ర జరిగింది.. చంద్రబాబుపై సుబ్రహ్మణ్య స్వామి కొత్త అనుమానాలు
కల్తీపై దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ నియమించటం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుకోవటం లేదు. జులైలో కల్తీ జరిగిందని చెప్పి.. ఇంతకాలం ఎందుకు సిట్ ను నియమించారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తిరుపతిలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఒక ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చారు. తద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మత ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. 2019లో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు.ఒక క్రైస్తవుడిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా నియమిస్తారని హిందూవాదులు అగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు పత్రికల్లో పతాక స్థాయిల్లో స్టేట్ మెంట్లు ఇచ్చారు. కల్తీ జరిగిందని కానీ.. చేపనెయ్యి.. కొవ్వు కలిసినట్లుగా ఎక్కడా లేదు. ఒకరి గుర్తింపును.. ఎదుగుదలను రాజకీయంగా నాశనం చేసేందుకు తప్పుడు వార్తలను ప్రచారం చేసి ఏజెన్సీలు సైతం ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సుబ్రమణ్య స్వామి హెచ్చరించారు.
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో Nalgonda అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు,…
AP Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలపై…
Peddi 6 Days Box Office Collection : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ram charan హీరోగా,…
Students Good News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
This website uses cookies.