Kommineni Srinivasa Rao : కొమ్మినేని విడుదల.. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు : జగన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kommineni Srinivasa Rao : కొమ్మినేని విడుదల.. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు : జగన్ 

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Kommineni Srinivasa Rao : కొమ్మినేని విడుదల.. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు : జగన్ 

Kommineni Srinivasa Rao : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సాక్షి టీవీలో జరిగిన డిబేట్‌లో వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు శుక్రవారం ఊరట కల్పించింది. ఈ కేసులో ఆయనను వెంటనే విడుదల చేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొమ్మినేని విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అంటూ విమర్శించారు.

Kommineni Srinivasa Rao కొమ్మినేని విడుదల సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు జగన్

Kommineni Srinivasa Rao : కొమ్మినేని విడుదల.. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు : జగన్

Kommineni Srinivasa Rao : కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల చేయాలనీ సుప్రీం కోర్టు తీర్పు

జగన్ వ్యాఖ్యానిస్తూ, కొమ్మినేనిపై విధించిన చర్యలు పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని, మీడియా స్వేచ్ఛను ముంచెత్తేలా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు తన పాలనా వైఫల్యాలు, అమరావతిలో జరిగిన అవినీతిని ప్రజల దృష్టికి రానివ్వకుండా చేయడానికే ఇలాంటి మినహాయింపు చర్యలు తీసుకున్నాడని ఆరోపించారు. కొమ్మినేని చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి ఆయనను నిర్దోషినిగా ఉన్నా బాధ్యత వహించేలా చేశారు అని అన్నారు.

అంతేకాదు ఒక విశ్లేషకుడి వ్యాఖ్యలకు యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనిపై చర్యలు తీసుకోవడం దుర్మార్గమని జగన్ అన్నారు. దీని ద్వారా చంద్రబాబు తన ‘ఎల్లో ముఠా’తో కలిసి కుట్ర పన్నారని, దాన్ని సుప్రీంకోర్టు తీర్పుతో దేశం ముందు తెరపైకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మీడియా ఆఫీసులపై దాడులు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని గద్దె దించడమేనన్నారు. చివరగా, సత్యం ఎప్పటికీ విజయం సాధిస్తుందని, అబద్ధాలు శాశ్వతంగా నిలవవని జగన్ పేర్కొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది