Telugu Desam Party : పండగ పూట టీడీపీ లో అతిపెద్ద భూకంపం .. లోకేష్ సంచలన నిర్ణయం
ప్రధానాంశాలు:
Telugu Desam Party : పండగ పూట టీడీపీ లో అతిపెద్ద భూకంపం .. లోకేష్ సంచలన నిర్ణయం
Telugu Desam Party : తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక సంచలన వార్త రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఉగాది పండుగ వేళ పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చేలా ఒక భారీ మార్పు జరగబోతోందని ప్రచారం ఊపందుకుంది. అదేమిటంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మార్చి 29వ తేదీన దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలియడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా పార్టీలో లోకేష్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ.. నేరుగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టడం అంటే అది పార్టీలో ఒక కొత్త శకానికి నాంది అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పార్టీని నడిపిస్తుంటే.. లోకేష్ యువ రక్తాన్ని నింపి పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. అందుకే ఈ పండగ పూట ఈ నిర్ణయం తీసుకోవడం ఒక రాజకీయ భూకంపం లాంటిదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Telugu Desam Party : పండగ పూట టీడీపీ లో అతిపెద్ద భూకంపం .. లోకేష్ సంచలన నిర్ణయం
Telugu Desam Party : పార్టీలో లోకేష్ కొత్త బాధ్యతలు – కార్యకర్తల్లో జోష్
ఈ నిర్ణయం వెనుక లోకేష్ తీసుకున్న సంచలన వ్యూహం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం పార్టీ పదవి తీసుకోవడమే కాకుండా.. పార్టీలో ఉన్న పాత తరం నేతలకు యువ నేతలకు మధ్య ఒక వారధిలా ఉండాలని లోకేష్ భావిస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఈ మార్పు కేవలం పేరుకే కాకుండా అధికారాల పరంగా కూడా లోకేష్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేలా ఉండబోతోందని సమాచారం.
ముఖ్యంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించడం అలాగే కొత్త రక్తాన్ని పార్టీలోకి ఆహ్వానించడం వంటి కీలక బాధ్యతలు ఇకపై లోకేష్ స్వయంగా చూసుకోనున్నారు. టైటిల్ లో చెప్పుకున్నట్లుగా నిజంగానే ఇది పార్టీలో ఒక పెద్ద కుదుపు లాంటిదే. ఎందుకంటే ఇప్పటివరకు చంద్రబాబు మార్క్ రాజకీయాలే నడిచాయి. కానీ ఇప్పుడు లోకేష్ స్టైల్ లో పార్టీ నిర్ణయాలు ఉండబోతున్నాయి. యువతను ఆకట్టుకోవడంలో లోకేష్ సక్సెస్ అవుతున్న తరుణంలో ఈ కొత్త పదవి ఆయనకు మరింత బలాన్ని ఇస్తుందని నమ్ముతున్నారు. ఈ మార్పు ద్వారా తెలుగుదేశం పార్టీ కొత్త ఊపును సంతరించుకుంటుందని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఈ పండగ నిర్ణయం రాబోయే కాలంలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.