YS Jagan : ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో వైసీపీ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో నో డౌట్. ప్రస్తుతం వైసీపీకి 150కి పైనే ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ కన్ఫమ్ అయినట్టేనా? అందరికీ టికెట్లు ఇస్తే అందరూ మళ్లీ గెలుస్తారా? వైసీపీ ఎమ్మెల్యేల్లో మంత్రులు కూడా ఉన్నారు. మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. వాళ్లంతా సీఎం జగన్ కు ఆత్మీయులే. వాళ్లంతా సీఎం జగన్ కు కావాల్సిన వాళ్లే కావడంతో అందరికీ టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ.. బయట పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. కొందరు మంత్రులపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
అసలు కొందరు మంత్రులను అయితే ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మంత్రులు గడపగడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. నిజానికి.. ఎమ్మెల్యేలు అంతా ఆ పనిలో ఉన్నారు. కానీ.. మంత్రులకు మాత్రం ప్రజల నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. ఇటీవల డిప్యూటీ సీఎం, మంత్రి నారాయణ స్వామి తన సొంత నియోజకవర్గంలో గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు ప్రజలు తమ ఇంటి తలుపులకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు.మంత్రి గుమ్మనూరు జయరాం పరిస్థితి కూడా అలాగే తయారైంది. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. చివరకు ఆయన ఇంటి ముందే ప్రజలు ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఈసారి ఆయనకు ఓటమి తప్పదని సొంత పార్టీ నాయకులే బహిరంగ విమర్శలు చేస్తున్నారు.
ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కూడా అంతే. అసలు తన నియోజకవర్గంలో ధర్మానకు మద్దతే లభించడం లేదు. మరో మంత్రి సీదిరి అప్పలరాజు కూడా వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు అంటారు. మహిళా మంత్రి ఉష పరిస్థితి కూడా అంతే అట. ఇలా.. చాలామంది మంత్రులు ప్రజల నుంచి వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వాళ్లకు టికెట్లు ఇస్తారా? ఇస్తే వాళ్లు మళ్లీ గెలుస్తారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.