YS Jagan : చంద్రబాబు ఇల్లు కాపాడేందుకే విజయవాడని ముంచేశారా..జగన్ స్టన్నింగ్ కామెంట్స్..!
YS Jagan : ప్రస్తుతం ఏపీలో వరద బాధితులు అనేక కష్టాలని చవిచూస్తున్నారు.ఊహించని వరద రావడంతో ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారింది. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. బుధవారం విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నివాసముంటున్న ప్రాంతం కూడా నీళ్లలో మునిగినందును అక్కడ ఉండలేని స్థితిలో కలెక్టరేట్లో ఉండి బాధితులకు సహాయం చేస్తున్నట్లు బిల్డప్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
వర్షాలు, వరదల సమాచారం ఉన్నాకూడా చంద్రబాబు ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎక్కడా రిలీఫ్ కేంద్రాలు కనిపించడం లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో గోదావరికి వరదలోస్తే పెద్ద ఎత్తున్న ఆదుకున్నామని అన్నారు.ముందస్తు చర్యలు తీసుకుని నష్టం జరుగకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటే , కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉంటే విజయవాడ విపత్తుకు గురి అయ్యేది కాదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా అట్టర్ఫ్లాప్ అని అన్నారు. వరదల్లో చనిపోయిన వారికి రూ. 25 లక్షల పరిహారం అందించాలని, ప్రతి ఇంటికి రూ. 50 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
YS Jagan : చంద్రబాబు ఇల్లు కాపాడేందుకే విజయవాడని ముంచేశారా..జగన్ స్టన్నింగ్ కామెంట్స్..!
పాలనలో వైఫల్యం కారణంగానే విజయవాడ ను వరదలు ముంచెత్తాయన్నారు. చంద్రబాబు నిర్లక్ష్య ధోరణి వల్లే నేడు 32 మంది మరణించారని చెప్పారు. చంద్రబాబుకు తన ఇంట్లో ఉండే అవకాశం లేకపోవడంతో కలెక్టరేట్ లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ప్రజల కోసం కలెక్టరేట్లో ఉంటున్నట్లు బిల్డప్ లు ఇస్తున్నారని మండిపడ్డారు. అయితే ఒకవైపు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు టీడీపీ నాయకులు.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.