
Ys Sharmila : షర్మిళకి బుద్దొచ్చిందా.. జగన్కి సపోర్ట్గా ఎన్నాళ్లకి మాట్లాడింది..!
Ys Sharmila : గత కొద్ది రోజులుగా అన్నా, చెల్లెళ్ల మధ్య కోల్డ్ వార్ ఏ రేంజ్లో నడుస్తుందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా జగన్పై షర్మిళ ఓ రేంజ్లో ఫైర్ అయింది. షర్మిళ విమర్శలు కూడా జగన్ ఓటమిలో భాగం అయ్యాయి. అయితే అటు ఎన్నికలలో షర్మిళ కూడా ఓటమి పాలవ్వడం మనం చూశాం. అయితే తొలిసారి షర్మిళ జగన్కి మద్దతుగా నిలిచింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందని డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధానికి కారణమైంది. డెక్కన్ క్రానికల్ రాసిన కథనంపై మంత్రి నారా లోకేష్ స్పందించడం, వైసీపీ కుట్రగా ఆయన అభివర్ణించడం, విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేయడానికి రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెక్కన్ క్రానికల్ కథనంపైన ఒక్కసారిగా అందరి ఫోకస్ పడింది.
ఈ నేపథ్యంలో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై మాజీ సీఎం జగన్ రియాక్టయ్యారు. ఈ దాడిని ఖండించారు. ఇప్పుడు షర్మిల కూడా అన్న బాటలోనే ఈ దాడిని ఖండించారు. జగన్ అభిప్రాయంతో ఆమె ఏకీభవించడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మొన్నటిదాకా జగన్ నే టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు జగన్ బాటలో టీడీపీపై విరుచుకు పడ్డారు. ఈ ఘటనతో జగన్ అభిప్రాయంతో ఏకీభవించి వైఎస్ షర్మిల మద్దతిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేక ఎదురు ఈ చర్యలా? అంటూ ప్రశ్నించారు.
Ys Sharmila : షర్మిళకి బుద్దొచ్చిందా.. జగన్కి సపోర్ట్గా ఎన్నాళ్లకి మాట్లాడింది..!
మేలుకోకపోతే రేపు ప్రజలు మీకు జవాబు చెప్తారని తేల్చి చెప్పారు. దమ్ముంటే మోడీని నిలదీయండి, అంతేకానీ నిలదీసే గొంతులపై ఉక్కు పాదం మోపొద్దు అంటూ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ ఇటువంటి దాడులను కచ్చితంగా వ్యతిరేకిస్తుంది అంటూ షర్మిల పేర్కొన్నారు. ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ కచ్చితంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో జగన్, షర్మిల ఒక ఇష్యూపై ఒకేలా స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఓ పత్రికా కార్యాలయంపై దాడిని ఎవరైనా ఖండిస్తారు కాబట్టి ఇందులో జగన్, షర్మిల మాటలను ముడి పెట్టి చూడాల్సిన అవసరం లేదనే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఎన్నికలకు ముందు మాటల యుద్ధం చేసిన అన్నాచెల్లి ఇప్పుడు ఒకే మాట మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.