Business Idea : థాయ్ జామ పండిస్తూ సంవత్సరానికి 32 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business Idea : థాయ్ జామ పండిస్తూ సంవత్సరానికి 32 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?

Business Idea : మధ్యప్రదేశ్ కు దినేష్ బాగ్గద్ ఒకప్పుడు సంప్రదాయ పంటలను పండించే వాడు… కానీ ఇప్పుడు థాయ్ జామ పండిస్తూ సంవత్సరానికి 32 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని బాగ్గద్ పొలానికి వెళ్లి చూస్తే ఎటు చూసినా కిలోల బరువు ఉండే పెద్ద పెద్ద జామకాయలు చెట్లకు వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి.దినేష్ బాగ్గద్ అందరు రైతుల్లాగే మిరప, టొమాటో, ఓక్రా, బైటర్ గోర్డ పండించే వాటు. వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల పొలంలో […]

 Authored By jyothi | The Telugu News | Updated on :24 March 2022,12:00 pm

Business Idea : మధ్యప్రదేశ్ కు దినేష్ బాగ్గద్ ఒకప్పుడు సంప్రదాయ పంటలను పండించే వాడు… కానీ ఇప్పుడు థాయ్ జామ పండిస్తూ సంవత్సరానికి 32 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని బాగ్గద్ పొలానికి వెళ్లి చూస్తే ఎటు చూసినా కిలోల బరువు ఉండే పెద్ద పెద్ద జామకాయలు చెట్లకు వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి.దినేష్ బాగ్గద్ అందరు రైతుల్లాగే మిరప, టొమాటో, ఓక్రా, బైటర్ గోర్డ పండించే వాటు. వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల పొలంలో కూరగాయలు పండించే వాడు. కానీ ఎప్పుడూ తెగుళ్లు, వాతావరణ పరిస్థితులు నష్టాన్ని తెచ్చిపెట్టేవి. కూరగాయల పెంపకానికి ఎరువుల వాడటం, కూలీల ఖర్చులు అంటూ పెట్టుబడి పెరిగిపోయేది. కానీ దాని నుండి వచ్చే లాభాలు అంతంత మాత్రమే. ఎప్పుడు దేనికి మంచి ధర ఉంటుందో అర్థం అయ్యేది కాదు.

ఈ క్రమంలో థాయ్ జామ గురించి అతనికి తెలిసింది. పొరుగు రాష్ట్రంలో ఒక రైతు పొలాన్ని సందర్శించి అవగాహన పెంచుకున్నాడు. వాటికి మార్కెట్ కూడా ఎక్కువగా ఉందని గమనించాడు. మరో అంశం ఏంటంటే వాటిని సాధారణ జామతో పోలిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంచొచ్చు. మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు.దినేష్ బాగ్గద్ తను కూడా జామ పండించాలని నిర్ణయానికి వచ్చాడు. సేంద్రీయ పద్ధతులు వాడితే పండు రుచి, పరిమాణం ఎక్కువగా ఉంటుందని అనుకున్నాడు. అలా తన పొలంలో థాయ్ జామ మొక్కలు నాటాడు. 11 నెలల తర్వాత దినేష్ కు మొదటి పంట చేతికి వచ్చింది. మొదటి కాతలో ఒక పండు బరువు 1.2కిలోల ఉంది. థాయ్ జామకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో దినేష్ కు లాభాలు వచ్చిపడ్డాయి.

Business Idea madhya pradesh farmer how to grow thai guava earns lakhs

Business Idea madhya pradesh farmer how to grow thai guava earns lakhs

దినేష్ తన సోదరులతో కలిసి 18 ఎకరాల్లో 4 వేల చెట్లను పెంచుతున్నాడు. తన  ఆదాయం ఐదు రెట్లు పెరిగింది. 2021 లో 65 టన్నులు ఉత్పత్తి చేశాడు దినేష్. ప్రతి పండు 400 నుండి 1,400 గ్రాముల మధ్య బరువు ఉంటుంది. భారీ పండు అలాగే దాని రుచి వినియోగదారులను ఆకర్షించిందని చెబుతాడు దినేష్.భిల్వారా, జైపూర్, ఉదయపూర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, పూణే, ముంబై, బెంగళూరు, భోపాల్, ఢిల్లీ మరియు ఇతరులతో సహా భారతదేశం అంతటా తన థాయ్ జామను విక్రయిస్తున్నాడు దినేష్. ప్రస్తుతం 18 ఎకరాల్లో సాగవుతున్న థాయ్ జామను మరో ఐదెకరాలకు విస్తరించాలన్న ప్లాన్ లో ఉన్నాడు. ప్రస్తుతం దినేష్ సంవత్సరానికి రూ. 32 లక్షలు సంపాదిస్తున్నాడు.ది. మధ్యప్రదేశ్లో 400 మంది రైతులు కూడా దావా వేశారు. Dinesh గమనికలు, “మొదట్లో, పండ్ల వివిధ హార్మోన్లు లేదా కొన్ని రసాయనాలతో వారి భారీ పరిమాణాన్ని సాధించాలని నేను సందేహించాను.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది