EPFO : పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త .. అందుబాటులోకి కొత్త యాప్‌ .. ఇక పై యూపీఐ ద్వారా కూడా డబ్బులు విత్ డ్రా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

EPFO : పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త .. అందుబాటులోకి కొత్త యాప్‌ .. ఇక పై యూపీఐ ద్వారా కూడా డబ్బులు విత్ డ్రా..!

 Authored By suma | The Telugu News | Updated on :10 February 2026,12:00 pm

ప్రధానాంశాలు:

  •  EPFO : పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త .. అందుబాటులోకి కొత్త యాప్‌ .. ఇక పై యూపీఐ ద్వారా కూడా డబ్బులు విత్ డ్రా..!

EPFO : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO దేశవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగులకు శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. పీఎఫ్‌ డబ్బు తీసుకోవాలంటే కార్యాలయాల చుట్టూ తిరగడం రోజుల తరబడి క్లెయిమ్‌లు వేచి చూడడం వంటి ఇబ్బందులకు త్వరలో ముగింపు రానుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న కొత్త విధానంతో యూపీఐ ద్వారా పీఎఫ్‌ ఉపసంహరణ సాధ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ఏప్రిల్‌ 2026లో ఒక ఆధునిక మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు.

Good news New mobile app to withdraw PF money through UPI

EPFO : పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త .. అందుబాటులోకి కొత్త యాప్‌ .. ఇక పై యూపీఐ ద్వారా కూడా డబ్బులు విత్ డ్రా..!

EPFO : కొత్త నియమాలు : రిజర్వ్‌ – తక్షణ ఉపసంహరణ విధానం

కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం కొత్త నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈపీఎఫ్‌వో ఫండ్‌లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే రిజర్వ్‌గా ఉంచనున్నారు. మిగతా ఎక్కువ మొత్తం సభ్యులకు తక్షణ ఉపసంహరణకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా యూపీఐ ఆధారిత వ్యవస్థ ద్వారా సభ్యులు తమ పీఎఫ్‌ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ విధానం వల్ల బ్యాంకింగ్ ప్రక్రియ మరింత వేగవంతంగా సురక్షితంగా మారనుంది. ప్రస్తుతం ఉన్న క్లిష్టమైన దరఖాస్తు విధానాలతో పోలిస్తే ఇది ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

EPFO : ఇప్పటి వరకు ఉన్న సమస్యలు … కొత్త యాప్‌తో పరిష్కారం

ప్రస్తుతం ఈపీఎఫ్‌ సభ్యులు UAN పోర్టల్ లేదా UMANG యాప్ ద్వారా క్లెయిమ్‌లు దాఖలు చేయాల్సి వస్తోంది. ఆ తరువాత వాటి పరిశీలన, ఆమోదం, సెటిల్మెంట్‌కు కొన్ని రోజులు నుంచి వారాల వరకు సమయం పడుతోంది. ఆటో-సెటిల్మెంట్ విధానం ఉన్నా కూడా దరఖాస్తు ప్రక్రియ తప్పనిసరి కావడంతో చాలామంది సాంకేతిక సమస్యలు డాక్యుమెంటేషన్ లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కొత్త మొబైల్ యాప్ ప్రారంభమైన తర్వాత ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పడనుంది. సభ్యులు తమ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్, పాస్‌బుక్, గత ఉపసంహరణ వివరాలను రియల్‌టైమ్‌లో చూసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైనప్పుడు లింక్ చేసిన యూపీఐ పిన్ ఉపయోగించి క్షణాల్లో లావాదేవీ పూర్తి చేయవచ్చు.

EPFO : కొత్త విధానంలో మూడు రోజుల్లోనే క్లెయిమ్‌ల పరిష్కారం, ఖాతాలోకి నగదు జమ

ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఏటా 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లను పరిష్కరించే ఈపీఎఫ్ఓపై భారాన్ని తగ్గించి, బ్యాంకుల తరహాలో వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇక “ఈపీఎఫ్ఓ 3.0” అప్‌గ్రేడ్‌లో భాగంగా ఈ కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం పీఎఫ్ డబ్బుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజులు పడుతోంది. కాగా, కొత్త ఆటో-సెటిల్‌మెంట్ విధానంలో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా మూడు రోజుల్లోనే క్లెయిమ్‌లు పరిష్కారమై డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

EPFO : ట్రయల్‌, భవిష్యత్‌ ప్రణాళికలు మరియు EPFOపై ప్రభావం

ఈ కొత్త వ్యవస్థను ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సుమారు 100 డమ్మీ ఖాతాల్లో పరీక్షిస్తోంది. సాంకేతిక లోపాలు ఏవైనా ఉంటే ముందుగానే సరిచేయడమే ఈ ట్రయల్ లక్ష్యం. ఈ పరీక్షలు విజయవంతమైతే ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా యాప్‌ను ప్రారంభించనున్నారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో దాదాపు 80 మిలియన్ల క్రియాశీల సభ్యులు ఉన్నారు. ఏటా 50 మిలియన్లకు పైగా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయాల్సి వస్తుండటంతో సంస్థపై భారీ పనిభారం పడుతోంది. కొత్త యూపీఐ ఆధారిత ఉపసంహరణ విధానం ఈ భారాన్ని గణనీయంగా తగ్గించనుంది. ఈపీఎఫ్‌వోకు బ్యాంకింగ్ లైసెన్స్ లేకపోయినా బ్యాంకింగ్ సేవలకు సమానమైన సౌకర్యాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే యూపీఐ ద్వారా నిధులను నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే విధానాన్ని తీసుకురానున్నారు. ఇక ఈ మార్పులు ఉద్యోగుల ఆర్థిక స్వేచ్ఛను మరింత పెంచనున్నాయి.

Advertisement

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది