
Business Idea mushroom farming startup vedanta makes healthy food
వికాస్ వర్మ 18 ఏళ్ల వయసులో పుట్టగొడుగుల పెంపకంలో చేసిన ప్రయోగం వల్ల రూ.14 లక్షల నష్టం వాటిల్లింది. అయినా హర్యానాలోని హిస్సార్కు చెందిన ఈ రైతు నష్టానికి వెరవలేదు. తను అనుకున్న లక్ష్యం వైపే ముందుకు సాగాడు. చివరికి తన బిజినెస్ ను బంపర్ సక్సెస్ చేసుకున్నాడు. ఇప్పుడు అతని పుట్టగొడుగుల పెంపకం అతనికి రూ. 50 లక్షల వ్యాపారాన్ని సంపాదిస్తుంది. అలాగే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు వికాస్ వర్మ. దాంతో పాటు చాలా మందికి పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ ఇచ్చాడు. ఆ ఉచిత కార్యక్రమం ఇంకా సాగుతోంది కూడా. ఒక రైతు కుటుంబంలో జన్మించాడు వికాస్. తన తాత మరియు తండ్రి సంప్రదాయ పంటలైన గోధుమలు, బజ్రా మరియు ఇతర ఆహార ధాన్యాలు పండించడాన్ని చూశాడు. అయితే, అతను 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, తనకు తన చదువుపై ఆసక్తి లేదని కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పాడు. అలాగే తాను ఒక వ్యవసాయ స్టార్టప్ ను ప్రారంభించాలని ఉందని, తన ఆలోచనలను కుటుంబంతో పంచుకున్నాడు.
తనకు వ్యవసాయంలో చేయాలని ఉందని ఖరాకండిగా చెప్పాడు.వికాస్ వెంటనే సమీపంలోని సోనిపట్ లో పుట్ట గొడుగుల పెంపకాన్ని కనుగొన్నాడు. గణనీయ సంఖ్యలో రైతులు పుట్టగొడుగులను పండిస్తున్నారు మరియు అక్కడ మంచి లాభాలను పొందుతున్నారు. అంతేకాకుండా, నా ప్రాంతంలో తెలిసిన ఏ రైతు కూడా శిలీంధ్రాలను వాణిజ్యపరంగా సాగు చేయలేదు. కాబట్టి, నేను దానిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నానని చెబుతాడు వికాస్ వర్మ.2014లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అయిన కృషి విజ్ఞాన కేంద్రం నుంచి శిక్షణ తీసుకుని వేదాంత మష్రూమ్ ప్రైవేట్ లిమిటెడ్. అనే సంస్థను ప్రారంభించాడు. 5,000 కంపోస్ట్ బ్యాగ్ లతో పుట్ట గొడుగుల పెంపకాన్ని ప్రారంభించడానికి స్పాన్లను కొనడానికి, సంచులు సిద్ధం చేయడానికి మరియు పుట్ట గొడుగులను పెంచడానికి ఒక యూనిట్ను ఏర్పాటు చేయడానికి రూ.14 లక్షలు వెచ్చించాడు. ప్రయోగాత్మకంగా చేసిన పనిలో వికాస్ వర్మను ఘోరంగా విఫలమయ్యాడు. ఇది తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను పెద్ద దెబ్బ తీసింది. కానీ వికాస్ వర్మ దానిని అలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు.
Business Idea mushroom farming startup vedanta makes healthy food
మరియు తన తప్పుల నుండి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు వికాస్. పుట్టగొడుగుల పెరుగుదలకు తన కంపోస్ట్ సరైనది కాదని వికాస్ తెలుసుకున్నాడు. కొన్ని వారాల తర్వాత, అతను విజయవంతమైన సాగుదారుగా మారడానికి సూత్రాన్ని కనిపెట్టాడు.అయినప్పటికీ, అతను ఉత్పత్తిని మార్కెటింగ్ చేయడంలో సవాళ్లను ఎదుర్కోవడం ప్రారంభించాడు. పుట్ట గొడుగులను కిలో ధర రూ.100కి ఇచ్చాడు. అయితే స్థానిక మార్కెట్ లో ఆశించిన స్థాయిలో పుట్ట గొడుగులకు ఆదరణ లేదు. అలాగే, పుట్ట గొడుగుల షెల్ఫ్-జీవితం 72 గంటలు. నిల్వ సౌకర్యం లేకపోవడంతో, నష్టాలను ఎదుర్కోన్నాడు. ఈ భయంతో కిలో రూ. 60 తక్కువ ధరకు పుట్ట గొడుగులను విక్రయించడం ప్రారంభించాడు. ఇది అసాధ్యమైన వెంచర్గా మారడం ప్రారంభించిందని అంటాడు వికాస్. వికాస్ వ్యవసాయ శాఖ అధికారుల సహాయం కోసం చాలా తిరిగాడు. పుట్ట గొడుగులను ఎండ బెట్టి, విలువ జోడించాలని వారు వికాస్ కు సూచించారు. పుట్ట గొడుగులను పొడి చేయడానికి మరియు ఆరోగ్య పానీయాలు, బిస్కెట్లు, పాపడ్ మరియు ఊరగాయలను తయారు చేయడం ప్రారంభించాననిను చెప్పాడు వికాస్ వర్మ.
క్షయ, థైరాయిడ్, మధుమేహం మరియు రక్తపోటు ఉన్న రోగులకు పుట్ట గొడుగుల పానీయం ఉత్తమంగా పని చేస్తుంది. అలాగే శాఖాహార ఆహారాన్ని అనుసరించే వ్యక్తులకు ఇది విటమిన్-డి యొక్క ఏకైక మూలం.నేడు, వికాస్ బటన్, ఓస్టెర్ మరియు మిల్కీ పుట్ట గొడుగులను పెంచుతున్నాడు. అవి అతనికి పది రెట్లు ఎక్కువ సంపాదన తెచ్చి పెట్టాయి. పుట్ట గొడుగులను కిలో రూ. 100 ధరకు అమ్మడం కాకుండా.. కిలో పుట్టగొడుగులకు విలువ-ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా కు రూ. 1,000 సంపాదిస్తున్నాడు. దీని వల్ల తనకు సంవత్సరానికి రూ. 35 లక్షల లాభం వస్తుందని చెబుతున్నాడు వికాస్. తన అతిపెద్ద మార్కెట్ ఢిల్లీ మరియు లూథియానాలో ఉంది. విజయాన్ని అందుకున్న వికాస్ తన రాష్ట్రంలోని రైతులకు సహాయం చేయడానికి తన నైపుణ్యాలను మరియు పరిజ్ఞానాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. ఇరుగు పొరుగు ప్రాంతాల్లోని చాలా మంది రైతులు తనను సంప్రదించడం ప్రారంభించారు. కాబట్టి, సమాజం పెద్దగా పురోగమించాలనే నమ్మకంతో వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని వివరించాడు వికాస్ వర్మ.
వికాస్ గత ఆరు సంవత్సరాలుగా 12,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చాడు. వారిలో 3,000 మంది రైతులు ఏడాది పొడవునా చురుకుగా పుట్ట గొడుగులను పండిస్తున్నారు. మరి కొందరు కాలానుగుణంగా పుట్ట గొడుగుల సాగు చేస్తున్నారు. మరికొందరు వారి సౌలభ్యం ప్రకారం వాటిని పెంచుతారని వికాస్ వర్మ పేర్కొన్నాడు. అయితే, వెంచర్ ను నిర్మించడంలో వికాస్ కి ఉన్న కీలకమైన సవాలు సరైన మార్కెట్ ను మరియు సరైన మార్గదర్శకత్వాన్ని కనుగొనడం. ఉత్పత్తుల కోసం కస్టమర్ బేస్ ను ఏర్పాటు చేయడానికి సమయం పట్టింది. ఈ ప్రక్రియలో తనకు మార్గనిర్దేశం చేయడానికి సహాయం చేసే రైతులు ఎవరూ లేరని అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు వర్మ. ఇందుకోసం తన ఉత్పత్తులను ఎగుమతి చేయాలని, తన వ్యవసాయ క్షేత్రంలో హైటెక్నాలజీ యూనిట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాడు. క్యానింగ్ యూనిట్ తో అధునాతన వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించడానికి తనకు ఎలాంటి ఆర్థిక సహాయం మరియు పొదుపు లేదని చెబుతున్నాడు. ఇతర రైతులు ప్రగతిశీల రైతులుగా మారడానికి తను సహాయం చేయాలనుకుంటున్నానని వినయంగా అంటాడు వికాస్.
PM Kisan 23rd installment : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి, పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…
Gold Silver Rate April 6th 2026 : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పసిడి ధరలకు…
Karthika Deepam 2 April 6th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్లో ప్రసారం అవుతూ,…
Summer Buttermilk : ఎండలు మండిపోతున్న వేళ శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగను మించిన పానీయం మరొకటి లేదు. సాధారణంగా మజ్జిగ…
Mango : వేసవి కాలం రాగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండు. అయితే పచ్చి మామిడికాయ మరియు…
Iced Tea Iced Coffee : వేసవి కాలంలో చల్లటి పానీయాలు తాగడం అందరికీ ఇష్టమే కానీ బరువు తగ్గాలని…
Pakistan Iran : గల్ఫ్ యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోవడం పాకిస్తాన్ పాలిట పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే…
Ration Cards : తెలంగాణలో అనర్హులైన రేషన్ కార్డుదారులపై ప్రభుత్వాలు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యాయి. నిరుపేదల కోసం ఉద్దేశించిన ఉచిత…
Chicken Prices : నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా మండిపోతున్న చికెన్ ధరలు ఎట్టకేలకు…
India Masterstroke: సముద్ర మార్గాల ద్వారా సాగే ప్రపంచ వాణిజ్యం ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తిరుగుతోంది. దశాబ్దాలుగా చమురు…
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.…
Pakistan: ప్రస్తుతం ఇస్లామిక్ దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మతం పేరుతో రాజకీయాలు ఎలా సాగుతాయో అర్థమవుతుంది. ముఖ్యంగా…
This website uses cookies.