
man earning crores of rupees through dairy farm,
dairy farm ప్రస్తుతం ఎక్కడ చూసినా మనం తినే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. ముఖ్యంగా రోజూ మనం తాగే పాలు కల్తీ బాగా అవుతున్నాయి. రక రకాల పదార్థాలతో పాలను కల్తీ చేస్తున్నారు. దీంతో స్వచ్ఛమైన పాలు మనకు లభించడం లేదు. అయితే ఇదే విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి తాను చేస్తున్న రూ.లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలి పెట్టి స్వదేశానికి వచ్చాడు. పాల వ్యాపారం చేస్తూ ఏటా రూ. 44 కోట్లు సంపాదిస్తున్నాడు. అతనే హైదరాబాద్కు చెందిన కిశోర్ ఇందుకూరి.
హైదరాబాద్కు చెందిన కిశోర్ ఇందుకూరి ఐఐటీ ఖరగ్పూర్లో విద్యను అభ్యసించాడు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్లో పాలిమర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో మాస్టర్స్, పీహెచ్డీ చేశాడు. అనంతరం అతనికి ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్లో జాబ్ వచ్చింది. రూ.లక్షల్లో జీతం. కానీ వ్యవసాయం మీద మక్కువతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. 6 ఏళ్ల పాటు జాబ్ చేసి తిరిగి హైదరాబాద్కు వచ్చి పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే అతను రూ.1 కోటి పెట్టుబడితో కోయంబత్తూర్లో 20 ఆవులను కొనుగోలు చేసి డెయిరీ బిజినెస్ ప్రారంభించాడు.
2012లో డెయిరీ వ్యాపారం dairy farm ప్రారంభించినా అతను విజయాల బాట పట్టేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆర్థిక సహకారంతో అతను వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చాడు. 2016లో తన డెయిరీ ఫామ్ను సిద్స్ ఫామ్ గా రిజిస్టర్ చేశాడు. ఈ క్రమంలోనే అతను దినదిన ప్రవర్థమానంగా ఎదిగాడు. సక్సెస్ సాధించాడు.
ప్రస్తుతం కిశోర్ తన డెయిరీ ఫామ్ dairy farm ద్వారా రోజుకు 10వేల మంది కస్టమర్లకు స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తున్నాడు. నాణ్యతే ప్రథమ ప్రాధాన్యతగా పాలను సరఫరా చేస్తుండడంతో అతను వినియోగదారుల అభిమానం చూరగొన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం అతని దగ్గర 120 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తన ఫామ్ ద్వారా అతను గతేడాది రూ.44 కోట్ల టర్నోవర్ సాధించినట్లు స్వయంగా తెలిపాడు. కరోనా ఉన్నప్పటికీ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా వారికే పాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు. ఇక ప్రస్తుతం అతను గేదె పాలను, వెన్న, నెయ్యి, పెరుగు వంటి ఉత్పత్తులను కూడా విక్రయించడం మొదలు పెట్టాడు.
ENG vs PAK T20 World Cup 2026 శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026…
Indiramma Houses : ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్లో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను…
Hyderabad : హైదరాబాద్ నగరంలో దోమల సమస్య రోజురోజుకు తీవ్రమవుతుండటానికి ఆశ్చర్యకరమైన కారణం బయటపడింది. నగర ప్రజల ఆరోగ్య రక్షణ…
Ys Jagan : తిరుమల లడ్డూ Thirupathi Laddu వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.…
Mahesh Babu vs Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోలే వినిపిస్తోంది. తాజాగా…
YSRCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో చిత్తూరు జిల్లా అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Peddireddy Ramachandra Reddy కుటుంబం…
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా…
Pawan Kalyan Vijay : తమిళనాడు Tamil Nadu Politics రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ పేరు Vijay మార్మోగిపోతోంది.…
Sara Tendulkar : సోషల్ మీడియా విస్తరణతో ప్రతి చిన్న విషయం కూడా పెద్ద చర్చగా మారుతోంది. ఇటీవల ప్రముఖ…
Annamaya District : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి…
KCR : తెలంగాణ Telangana రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు గులాబీ బాస్ కేసీఆర్ వైపే ఉంది. అసెంబ్లీ ఎన్నికల…
Good News : ఆంధ్రప్రదేశ్లో సొంతిల్లు లేని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ప్రధాన్ మంత్రి…
This website uses cookies.