
man earning crores of rupees through dairy farm,
dairy farm ప్రస్తుతం ఎక్కడ చూసినా మనం తినే ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. ముఖ్యంగా రోజూ మనం తాగే పాలు కల్తీ బాగా అవుతున్నాయి. రక రకాల పదార్థాలతో పాలను కల్తీ చేస్తున్నారు. దీంతో స్వచ్ఛమైన పాలు మనకు లభించడం లేదు. అయితే ఇదే విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి తాను చేస్తున్న రూ.లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా వదిలి పెట్టి స్వదేశానికి వచ్చాడు. పాల వ్యాపారం చేస్తూ ఏటా రూ. 44 కోట్లు సంపాదిస్తున్నాడు. అతనే హైదరాబాద్కు చెందిన కిశోర్ ఇందుకూరి.
హైదరాబాద్కు చెందిన కిశోర్ ఇందుకూరి ఐఐటీ ఖరగ్పూర్లో విద్యను అభ్యసించాడు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్లో పాలిమర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో మాస్టర్స్, పీహెచ్డీ చేశాడు. అనంతరం అతనికి ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్లో జాబ్ వచ్చింది. రూ.లక్షల్లో జీతం. కానీ వ్యవసాయం మీద మక్కువతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. 6 ఏళ్ల పాటు జాబ్ చేసి తిరిగి హైదరాబాద్కు వచ్చి పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే అతను రూ.1 కోటి పెట్టుబడితో కోయంబత్తూర్లో 20 ఆవులను కొనుగోలు చేసి డెయిరీ బిజినెస్ ప్రారంభించాడు.
2012లో డెయిరీ వ్యాపారం dairy farm ప్రారంభించినా అతను విజయాల బాట పట్టేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆర్థిక సహకారంతో అతను వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చాడు. 2016లో తన డెయిరీ ఫామ్ను సిద్స్ ఫామ్ గా రిజిస్టర్ చేశాడు. ఈ క్రమంలోనే అతను దినదిన ప్రవర్థమానంగా ఎదిగాడు. సక్సెస్ సాధించాడు.
ప్రస్తుతం కిశోర్ తన డెయిరీ ఫామ్ dairy farm ద్వారా రోజుకు 10వేల మంది కస్టమర్లకు స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తున్నాడు. నాణ్యతే ప్రథమ ప్రాధాన్యతగా పాలను సరఫరా చేస్తుండడంతో అతను వినియోగదారుల అభిమానం చూరగొన్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం అతని దగ్గర 120 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తన ఫామ్ ద్వారా అతను గతేడాది రూ.44 కోట్ల టర్నోవర్ సాధించినట్లు స్వయంగా తెలిపాడు. కరోనా ఉన్నప్పటికీ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా వారికే పాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు. ఇక ప్రస్తుతం అతను గేదె పాలను, వెన్న, నెయ్యి, పెరుగు వంటి ఉత్పత్తులను కూడా విక్రయించడం మొదలు పెట్టాడు.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.